ఓటు వరంలో..యువ తరంగం
యువత ఓట్లే నవభారత్కు పునాదిగా నిలుస్తాయి.ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి అపారం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఇది అత్యంత శక్తివంతమైన సాధనం.
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే
యువత ఓట్లే నవభారత్కు పునాదిగా నిలుస్తాయి.ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి అపారం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. అక్టోబరు 2023 వరకు 18 ఏళ్లు నిండే వారు ప్రస్తుతం ఓటరుగా నమోదుకు అర్హత సాధిస్తారు. వారందరినీ భారత ప్రజాస్వామ్యం స్వాగతిస్తోంది. ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. ఎవరినైనా గద్దె ఎక్కించాలన్నా.. దించాలన్నా.. ఓటుతోనే సాధ్యం.
యువతను ఓటర్లను చేర్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటుపై యువతకు అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్లను ఏర్పాటు చేసి పాఠశాల, కళాశాల, పోలింగ్ కేంద్రం వారీగా ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగం, ప్రాధాన్యం గురించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు భవిష్యత్తులో ఓటు నమోదు, దాని వినియోగం, ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిగ్రీ ఆపైన ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కొత్త ఓటరు నమోదు, ఓటు ప్రాధాన్యం, ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తున్నారు. చదువు మానేసి ఇంటివద్ద ఉంటున్న వారికి పోలింగ్ కేంద్రం వారీగా ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండేవారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
23 వేలకు పెరిగిన కొత్త ఓటర్లు
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు 23 వేల మంది కొత్తగా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత ఏడాది నవంబరు నుంచి డిసెంబరు వరకు నిర్వహించిన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో సుమారు 14 వేల మంది కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగింది. అధికంగా మునుగోడు నియోజకవర్గంలో 5485 మంది యువత కొత్తగా ఓటరుగా నమోదు అయ్యారు. తక్కువగా దేవరకొండ నియోజకవర్గంలో 1757 మంది నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM