ధాన్యం కొనుగోళ్లలో మాయాజాలం గుట్టురట్టు
నకిరేకల్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, తూకాల్లో మిల్లర్ల మాయాజాలం వాస్తవమేనని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా తేల్చింది.
ఇద్దరు అధికారులపై చర్యలకు ఆదేశాలు
ముందే వెలుగులోకి తెచ్చిన ‘ఈనాడు’
ధాన్యం కొనుగోళ్లలో మోసాలపై ‘ఈనాడు’లో ప్రచురితమైన ఓ కథనం
నకిరేకల్, న్యూస్టుడే: నకిరేకల్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, తూకాల్లో మిల్లర్ల మాయాజాలం వాస్తవమేనని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా తేల్చింది. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్కు గాను ఆ ఏడాది మార్చి నుంచి మే వరకు ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు నిర్వహించారు. ఓగోడుతోపాటు పరిసర గ్రామాలకు చెందిన దాదాపు 357 మంది రైతులు 27 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం విక్రయించారు. వీటికి సంబంధించిన ధాన్యం డబ్బులు జూన్, జూలై మాసాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కొనుగోలు సమయంలో 40 కిలోల బస్తాకు తరుగు పేరిట అదనంగా ధాన్యం సేకరించారు. రైతులకు డబ్బులు చెల్లించే సమయంలో మాత్రం తరుగు పేరుతో భారీగా కోత విధించారు. ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి 20 వేల వరకు కోతపడింది. ఇలా కోత విధించిన ధాన్యం డబ్బు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ విచారణలో గుట్టురట్టయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై 2021 జూన్ 24 నుంచి ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించింది. రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఓగోడు కేంద్రంలో నాడు ధాన్యం విక్రయించిన రైతులు రూ.3 లక్షల వరకు నష్టపోయారని తాజాగా విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో పౌరసరఫరాల శాఖË మేనేజర్, ఓగోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన మండల ఏపీఎంను బాధ్యులను చేస్తూ వీరిపై చర్యల కోసం పౌరసరఫరాల కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. నాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన రైతులకు మాత్రమే వారు నష్టపోయిన డబ్బుల్లో కొంత మేర సెర్ఫ్ నుంచి రూ.1.05 లక్షలు, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మరికొంత సొమ్మును తిరిగి చెల్లించారు. ఫిర్యాదులు చేయని ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందలేదు.
మిల్లులపై చర్యలు నామమాత్రం
నాడు ఈ ప్రాంతంలోని ఐదు మిల్లులు ఈ ధాన్యం దిగుమతులకు సంబంధించి తూకాల్లో మోసాలకు పాల్పడినట్లు విజిలెన్సు అప్పట్లోనే గుర్తించడంతో గత జులై నుంచి ఈ మిల్లులను అధికారులు బ్లాక్లిస్టులో పెట్టి సీఎంఆర్ ధాన్యం కేటాయించలేదు. మిల్లులపై ఎలాంటి చర్యలు లేకుండానే ఈ ఖరీఫ్లో ఈ మిల్లులపై జిల్లా అధికారులు నిషేధం ఎత్తివేసి సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దంతే
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!