అట్లాస్లో ఇట్లున్నం..!
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రైతులు మరణించారని ‘రాష్ట్ర గణాంకాల నివేదిక - అట్లాస్’ వెల్లడించింది.
రైతు మరణాలు అధికం
పంటల సాగు, రహదారుల్లో అగ్రస్థానం
ఈనాడు, నల్గొండ : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రైతులు మరణించారని ‘రాష్ట్ర గణాంకాల నివేదిక - అట్లాస్’ వెల్లడించింది. పంటల సాగుతో పాటూ జాతీయ, పంచాయతీ, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారులు ఎక్కువగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
* ముగిసిన 2021 - 22 ఏడాదిలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి, పత్తిని సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే పండించడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో రెండు సీజన్లు కలిపి 9.07 లక్షల ఎకరాల్లో వరి సాగవగా..నల్గొండ జిల్లాలో 8.96 లక్షల ఎకరాల్లో అన్నదాతలు వరిని సాగు చేశారు. యాదాద్రి జిల్లాలో 4.21 లక్షల ఎకరాలతో పంటల సాగులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. విభాజ్య నల్గొండ జిల్లాలో గతేడాది 6.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. యాదాద్రిలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేశారు.
* ఒకప్పుడు భూగర్భజలాలు లేక అల్లాడిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు అన్ని మండలాల్లోనూ భూగర్భ జలలభ్యత ఆశాజనకంగా ఉంది. నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో 26 మండలాల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండగా..ఆరు మండలాల్లో రానున్న రోజుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని నివేదిక పేర్కొంది. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు 21 మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా ఉండగా..రెండు మాత్రమే సెమి క్రిటికల్ మండలాలున్నాయి. యాదాద్రిలోని మొత్తం 17 మండలాల్లోనూ నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నట్లు ‘అట్లాస్’ నివేదిక పేర్కొంది.
* ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల శాతం నల్గొండ జిల్లాలో మెరుగ్గా ఉంది. సూర్యాపేటలోనూ పరిస్థితి కొంత ఫర్వాలేకున్నా యాదాద్రిలో నిరుత్సాహంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఏడాది (2022 - 23) ఆగస్టు వరకు నల్గొండ జిల్లాలో 4,267 కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయగా...సూర్యాపేటలో 2,354, యాదాద్రి జిల్లాలో 1,313 కిట్లను పంపిణీ చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
* 2018 నుంచి 2022 మార్చి వరకు నల్గొండ జిల్లాలో 5673 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా.. వారందరికీ ప్రభుత్వం రైతుబీమా కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. ఇందులో అత్యధికంగా 39 నుంచి 48 ఏళ్ల వారే 2035 ఉండగా...18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకున్న యువరైతులు 221 మంది మరణించడం గమనార్హం. గతంలోనే రైతు ఆత్మహత్యల్లో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలోనూ ఈ విషయం స్పష్టం కావడం ఆందోళనకర పరిణామం. సూర్యాపేటలో 2989 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రైతు బీమాను ప్రభుత్వం అందజేసింది. యాదాద్రిలో 2474 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది.
* జాతీయ రహదారులతో పాటూ పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఆధ్వర్యంలోని రహదారుల్లో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోనే రద్దీ రహదారి అయిన హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - వరంగల్, కోదాడ - జడ్చర్ల, సిరోంచ - రేణిగుంట రహదారులతో పాటూ సుమారు ఏడు వరకు జాతీయ రహదారులు వెళుతుండగా, ప్రస్తుతం కొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
* రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో ఉపాధి కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారు. మొత్తం జాబ్కార్డులున్న వారిలో 47 శాతం ప్రజలు కూలీ పని చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పేరు నమోదు చేసుకొని పని చేస్తున్న వారు నల్గొండ జిల్లాలో 30 శాతం మాత్రమే ఉండగా...యాదాద్రిలో 28 శాతం ఉంది.
* ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు నూరు శాతం మంచినీరు అందుతుందని నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!