నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే!
బొమ్మలరామారం మండలం హాజీపూర్ -మాచనపల్లి, బండకాడిపల్లి-మునిరాబాద్ గ్రామాల మధ్యగల శామీర్పేట వాగులపై వంతెనలు లేకపోవడంతో దశాబ్దాల కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
శామీర్పేట వాగుపై హాజీపూర్-మాచనపల్లి మధ్య వంతెన నిర్మించాల్సిన ప్రాంతం
ఆలేరు, బొమ్మలరామారం, న్యూస్టుడే: బొమ్మలరామారం మండలం హాజీపూర్ -మాచనపల్లి, బండకాడిపల్లి-మునిరాబాద్ గ్రామాల మధ్యగల శామీర్పేట వాగులపై వంతెనలు లేకపోవడంతో దశాబ్దాల కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం హాజీపూర్-మాచనపల్లి మధ్యఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి రూ.6.31 కోట్లు, బండకాడిపల్లి-మునిరాబాద్ మధ్యగల వాగుపై వంతెన నిర్మాణానికి రూ.1.61కోట్లు మంజూరు చేసింది. టెండర్లు కూడా ఖరారయ్యాయి. పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
ఇవీ.. ఇబ్బందులు..
శామీర్పేట వాగు ప్రవహించే సమయంలో వాగుకు అవతల ఉన్న మునిరాబాద్కు రాకపోకలు నిలిచిపోతాయి. విద్యార్థులు జలాల్పురంలోని పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. సూచనపల్లి, మర్యాల, నాయకునితండా, చౌదర్పల్లి గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలలకు హాజరుకాలేక పోతున్నారు. వాగుకారణంగా 20 కి.మీ దూరం తిరిగి వెళ్తేకానీ పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. ఆయా గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రానికి, హైదరాబాద్, భువనగిరి, యాదాద్రిలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
వంతెనల నిర్మాణం జరిగితే...
హాజీపూర్- మాచనపల్లి. బండకాడిపల్లి- మునీరాబాద్ గ్రామాల మధ్య షామీర్పేట వాగుపై వంతెనలు నిర్మిస్తే మండలంలోని సగం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. మండల కేంద్రానికి హైదరాబాద్, జిల్లా కేంద్రమైన భువనగిరి, యాదాద్రిలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ధాన్యం, కూరగాయులు విక్రయించేందుకు, ప్రయాణించే దూరం తగ్గుతుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీటి సామర్థ్యం పెరుగుతుంది.
చర్యలు తీసుకుంటాం
-వెంకటేశ్వర్లు, డీఈ, పీఆర్, యాదాద్రి భువనగిరి
హాజీపూర్-మాచనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న షామీర్పేట వాగు బ్రిడ్జి నిర్మించేందుకు ప్రధాన మంత్రి సడక్ యోజనలో నిధులు మంజూరయ్యాయి. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులకు నోటీసులు జారీచేశాం. త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్