పదోన్నతుల సమస్య.. తీరక ఆందోళన బాట
భాషా పండితులకు పదోన్నతులు చేపట్టకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి నుంచి భాషోపాధ్యాయుల తరగతుల బహిష్కరణకు పిలుపు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: భాషా పండితులకు పదోన్నతులు చేపట్టకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా భాషా పండితుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతోందనే ఆవేదన వ్యక్తమవుతూనే ఉంది. వీరి ఆందోళనల ఫలితంగా యూపీఎస్ల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడంతో పండిట్ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేశారు. ఈ మేరకు అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు చేపట్టలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర పండిత ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్యవేదికగా ఏర్పడి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్థూ బోధనను నిలిపివేయాలని, జాబ్చార్ట్ ప్రకారమే విధులు నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో లాంగ్వేజి పండిట్లు తెలుగు 345 మంది, హిందీ 377 మంది, ఉర్థూ 10 మంది ఉన్నారు.
జాబ్చార్టు ప్రకారం..
జాబ్చార్టు ప్రకారం భాషా పండిట్లు 6,7,8 తరగతులు బోధించాల్సి ఉండగా.. జిల్లాలో చాలా వరకు ఉన్నత పాఠశాలల్లో వీటితో పాటు 9, 10 తరగతులను వీళ్లే బోధిస్తున్నారు. అందుకు రూ.150 అదనంగా అలవెన్స్ ఇస్తారు. ఈ అలవెన్స్ కూడా కొన్ని చోట్ల పండితులకు అందడం లేదు. ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టడంతో భాషాపండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వినతలు సమర్పించడమే కాకుండా.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు కూడా హాజరై ఆందోళన వ్యక్తం చేశారు. అయినా.. వాళ్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టం చేస్తూ తమ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
న్యాయం చేయాలి..
ఎండి.యూసుఫుద్దీన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడు, నల్గొండ జిల్లా
భాషాపండితులకు పదోన్నతుల విషయంలో ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతొంది, ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలి. కోర్టు కేసు పేరుతో కాలయాపన చేయడం వల్ల ఎంతో మంది భాషాపండితులు పదోన్నతులు పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వం కోర్టు స్టేను ఖాళీ చేయించి పదోన్నతులు ఇవ్వాలి. ఈ విషయంలో సీఎం చొరవ తీసుకుని న్యాయం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!