ఆర్టీసీలో సత్వర పార్సిల్ రవాణా
ఆర్టీసీ ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
‘ఏఎం 2 పీఎం’ పేరుతో నూతన సేవలు
మిర్యాలగూడలోని లాజిస్టిక్స్ డెలివరీ కేంద్రం
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఆర్టీసీ ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కార్గో నుంచి లాజిస్టిక్స్గా పేరు మార్చారు. ఇక తాజాగా పార్సిళ్లను సత్వరమే రవాణా చేసేందుకు ‘ఏఎం 2 పీఎం’ పేరుతో నూతన సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 99 లాజిస్టిక్స్ కేంద్రాల నుంచి రూ.99కే.. మధ్యాహ్న 12 గంటల లోపు పార్సిల్ బుక్ చేస్తే రాత్రి 9 గంటలకు.. రాత్రి 9 గంటల లోపు బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు గమ్యస్థానానికి చేరవేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో మూడు డిపోల నుంచి..
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 99 కేంద్రాలలో ఉమ్మడి జిల్లా నుంచి నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట డిపోల నుంచి ‘ఏఎం 2 పీఎం’ సేవలు ప్రారంభమయ్యాయి. నల్గొండ డిపో నుంచి దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, మిర్యాలగూడ, సూర్యాపేటకు; మిర్యాలగూడ డిపో నుంచి దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నల్గొండ, సూర్యాపేటకు; సూర్యాపేట డిపో నుంచి నల్గొండకు, సూర్యాపేట హైటెక్ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్కు ఎక్స్ప్రెస్ పార్సిల్ సేవలు అందించనున్నారు. ఇక హైదరాబాద్ ఆటోనగర్ నుంచి నల్గొండకు, దిల్సుఖ్నగర్ నుంచి మిర్యాలగూడ, నల్గొండలకు, ఖమ్మం నుంచి కోదాడకు, ఎంజీబీఎస్ నుంచి నల్గొండకు సత్వర పార్సిల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
బరువు కిలో లోపే ఉండాలి..
‘ఏఎం 2 పీఎం’లో భాగంగా బుక్ చేసే పార్సిల్ బరువు కిలోకు మించకుండా..విలువ రూ.5వేల లోపు మాత్రమే ఉండాలి. బుక్ చేసిన వారికి..డెలివరీ తీసుకునే వారికి సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు ఐదు కిలోల బరువున్న పార్సిళ్లను రవాణా చేయనున్నారు.
సద్వినియోగం చేసుకోండి
-గిరి మహేష్, నల్గొండ, మహబూబ్నగర్ రీజియన్ల లాజిస్టిక్స్ అధికారి
వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ‘ఏఎం 2 పీఎం’ సేవలను పరిచయం చేస్తున్నాం. తద్వారా పార్సిల్ బుక్ చేసిన తర్వాత గరిష్ఠంగా 9 గంటల లోపు గమ్య స్థానానికి చేర్చడంతో పాటు ఆ పార్సిల్పై అనుక్షణం పర్యవేక్షణ చేయనున్నాం. ప్రస్తుతం ఒక కిలో వరకే అనుమతి ఉన్నప్పటికీ భవిష్యత్తులు గమ్యస్థానాలు, బుకింగ్ కేంద్రాలు పార్సిళ్ల బరువు సైతం పెంచే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. -
కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి: క్యామ మల్లేష్
[ 23-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్