ఆశయ గమనంలో అంశాల అస్తమయం
అత్యధిక ఫ్లోరిన్ పీˆడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగు నీటి జలాల సాధనలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారు.
అంశాల స్వామి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, తదితరులు
మర్రిగూడ (నాంపల్లి), న్యూస్టుడే: అత్యధిక ఫ్లోరిన్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగు నీటి జలాల సాధనలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. మారుమూల పల్లె జనం నీటి బాధలను తెలియజెప్పి దేశం దృష్టిని నల్గొండ వైపు మళ్లించారు. అతనే మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి(37). శుక్రవారం సాయంత్రం మూడు చక్రాల వాహనంపై నుంచి కింద పడిన ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు.
పోరాట ఫలితమే.. ‘మిషన్ భగీరథ’
ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో అంశాల స్వామి అలుపెరుగని పోరాటం, ప్రజల తాగు నీటి ఇబ్బందులు గమనించిన తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’తో తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లాలో సాగు నీటిలో సైతం ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉండటం, ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను క్రోడీకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగు జలాల సరఫరాకు పచ్చజెండా ఊపాయి. వీటి ప్రతిఫలమే నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకాలు.
అంశాల స్వామి మృతదేహంపై విలపిస్తున్న జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ
కడసారిగా కదిలి వచ్చిన ఆత్మీయత..
అంశాల స్వామి మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన శివన్నగూడేనికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నాంపల్లి, మర్రిగూడ, చండూరు, చింతపల్లి, మునుగోడు మండలాల నుంచి వచ్చిన ప్రజలు మా గ్రామాలకు తాగు నీరు రావడానికి కారణం నీవే అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు దివ్యాంగులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేసి, అంతిమ సంస్కార పనులను పర్యవేక్షించారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి…, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భారాస రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ పాడె మోశారు. మాజీ ఎంపీˆ బూర నర్సయ్యగౌడ్, జడ్పీటీసీ సభ్యులు పాశం సురేందర్రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, మాల్ మార్కెట్ ఛైర్మన్ జగదీశ్, కాంగ్రెస్ నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, కంచుకట్ల సుభాష్, వివిధ పార్టీల నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు అంత్యక్రియల ఖర్చును తాను భరించినట్లు కర్నాటి విద్యాసాగర్ తెలిపారు. ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆలపించిన గీతాలు పలువురిని కంటతడి పెట్టించాయి. స్వామి మృతి చెందడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.