ఆసక్తి పెంచేలా.. సృజనకు పదును పెట్టేలా..!
నూతన అవకాశాలను అన్వేషించడం.. ఆధునిక కాలంలో వినియోగం, ప్రాథమిక స్థాయిలో ఆసక్తి పెంచడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సైన్స్ సదస్సు నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిద్ధమైంది.
పరిశోధన పత్రాల ఆహ్వానం.. రేపటి వరకు గడువు
ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ ముఖ చిత్రం
ఆలేరు, న్యూస్టుడే: నూతన అవకాశాలను అన్వేషించడం.. ఆధునిక కాలంలో వినియోగం, ప్రాథమిక స్థాయిలో ఆసక్తి పెంచడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సైన్స్ సదస్సు నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాల దరఖాస్తులను ఎస్సీఈఆర్టీ ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరిచుకుని ఏటా ఎస్సీఈఆర్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పాల్గొనేందుకు అర్హతలు.. అంశాలు..
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రైవేటు బీఈడీ, డీఈడీ టీచర్ ఎడ్యుకేటర్లు, ఎన్జీవోలు, సైన్స్ ఎడ్యుకేషన్కు సంబంధించిన వారు ఇందులో పాల్గొనొచ్చు. ఇలాంటి వారు జిల్లాలో పది వేలకు పైగా ఉన్నారు. వీరితో పాటు సైన్స్ ఎడ్యుకేటర్లు, క్షేత్రస్థాయిలో పని చేసే పరిశోధకులు ఉన్నారు. వీరంతా సదస్సును సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సారి సదస్సుకు సంబంధించి ప్రధాన అంశం ‘దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించడం’ కాగా, మరో ఐదు ఉప అంశాలున్నాయి. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు వారి అనుభవాలను పరిశోధన పత్రాల రూపంలో పంపాల్సి ఉంటుంది.
వెయ్యి పదాలకు మించకుండా..
ఆసక్తిగల సైన్స్ ఉపాధ్యాయులు తమ పరిశోధన పత్రాలను గురువారం నాటికి పంపాల్సి ఉంటుంది. వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీలలో రాసి పంపాలి. ఆంగ్లం, తెలుగు భాషల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. పీడీఎఫ్ రూపంలో tgscertmathsscience@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపాలి. పరిశోధన పత్రాలను సమర్పించిన పత్రాలను ఎస్సీఈఆన్టీ పరిశీలించి ఎంపికైన వారికి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఉత్తమ అంశాలను క్షేత్రస్థాయిలో అమలు పరిచేలా చర్యలు తీసుకుంటారు. సదస్సుకు ఎంపికైన వారికి టీఏ, డీఏ చెల్లిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
- భరణి కుమార్, జిల్లా సైన్స్ అధికారి, యాదాద్రి భువనగిరి
ఈ అవకాశాన్ని సైన్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచనలు, అనుభవాలను తెలిపేందుకు భాగస్వాములు కావాలి. సైన్స్ బోధనా విధానంలో మార్పులను తీసుకొచ్చేందుకు ఏటా సదస్సు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.