వచ్చేస్తోంది.. మహా జాతర
శ్రీ లింగమంతుల స్వామి జాతరకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జాతరకు లక్షల మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో వివిధ రకాల వ్యాపారాలకు ఇది నెలవు కానుంది.
గట్టు జాతర వద్ద గాజులు విక్రయిస్తున్న మహిళలు (పాతచిత్రం)
సూర్యాపేట కలెక్టరేట్, చివ్వెంల, న్యూస్టుడే: శ్రీ లింగమంతుల స్వామి జాతరకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జాతరకు లక్షల మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో వివిధ రకాల వ్యాపారాలకు ఇది నెలవు కానుంది. ఏటా వివిధ రకాల వ్యాపారాలు నెలకొల్పి రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. గుట్ట సమీపంలో వ్యాపారాలు నెలకొల్పేందుకు రూ.వేలల్లో వేలం పాటలు పాడి మరీ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎదురు చూస్తుంటారు.జాతరలో ముఖ్యంగా మహిళలకు కావాల్సిన గాజులు, చిన్నారులకు బొమ్మలు, ఆట వస్తువులు, కుటుంబ సభ్యులు సరదాగా గడిపేందుకు ఎగ్జిబిషన్ వంటివి అందుబాటులో ఉంటాయి. అన్నీ కలిపి రూ.కోట్లలో వ్యాపారం జరుగనుంది.
ఆకర్షణగా ఎగ్జిబిషన్..
జాతరకు వచ్చిన భక్తులు ముందుగా దేవుడి దర్శనం కోసం వెళ్తారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్కు ప్రాధాన్యం ఇస్తారు. ఎగ్జిబిషన్లో వివిధ రకాల ఆట వస్తువులు, సాహసాలు చేసేవి, జాయింట్ వీల్ తదితర వస్తువులు ఉంటాయి. గత జాతరలో రూ.50 నుంచి రూ.80 లక్షల ఆదాయం పొందినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మరో అయిదు రోజుల్లో ప్రారంభమయ్యే జాతరకు ఇప్పటికే ఎగ్జిబిషన్ ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్
గాజుల విక్రయం..
జాతరలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చేతికి అలంకార ప్రాయంగా కాకుండా సంప్రదాయంగా వీటిని భావిస్తుంటారు. సంప్రదాయానికి ప్రతీకగా తమ ఇంటి ఆడపడుచులకు గాజులు తొడిగేందుకు ఆసక్తి చూపుతారు. దేవుడి దగ్గర గాజులు కొనుగోలు చేసేందుకు ప్రాధ్యాన్యం ఇస్తుండటంతో జాతర సమయంలో గట్టు చుట్టూ గాజులు దుకాణాలు దర్శనమిస్తుంటాయి. గతంలో గాజుల వ్యాపారం మీద రూ.లక్షల్లో ఆదాయం పొందారు. ఇప్పటి నుంచే వ్యాపారులు దుకాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అందుబాటులో అన్ని రకాల ఆట వస్తువులు
జాతరకు తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు కూడా వస్తుంటారు. వారికి నచ్చిన అన్ని రకాల ఆట వస్తువులు లభిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు శ్రద్ధ చూపుతారు. ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులను ప్రధాన రహదారి నుంచి మొదలు గుట్ట వరకు ఏర్పాటు చేస్తారు. ఈ ఆట వస్తువుల మీద రూ.వేలల్లో ఆదాయం పొందుతారు.
మాంసం వ్యాపారులకు ఆదాయం..
గట్టు వద్ద విక్రయిస్తున్న కుండలు
రెండేళ్లకోసారి జరిగే జాతర కావడంతో ప్రత్యేకంగా మొక్కులు తీర్చేందుకు భక్తులు ఎదురు చూస్తుంటారు.యాదవుల కుల దైవమైన లింగమంతుల స్వామి జాతరకు ఇక్కడ స్థానికంగా ఉండేవారు వారు బంధువులు, స్నేహితులను పిలుచుకుని ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర వద్ద బోనమెత్తిన అనంతరం జీవాలను బలిచ్చి సంప్రదాయయంగా జరుపుకుంటారు. అప్పటికప్పుడు కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా నాటు కోళ్ల దుకాణాలు సైతం ఏర్పాటు చేస్తారు. గొర్రె పోతులు కావాల్సిన వారికి అక్కడే అందుబాటులో లభిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ వ్యాపారం మీద వారు ప్రతిసారి రూ.వేలల్లో ఆదాయం పొందుతారు. బోనమెత్తేందుకు కుండల అవసరం కావడంతో వాటిని కూడా అక్కడికే తెచ్చి విక్రయిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్