పోడుస్తోంది..!
పోడు భూములు సాగు చేస్తున్న వారికి ఆ భూములపై హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబరులో దరఖాస్తులు స్వీకరించింది.
ఏడాదిగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు
పోడుభూముల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చందంపేట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన గిరిజనులు (పాతచిత్రం)
నల్గ్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: పోడు భూములు సాగు చేస్తున్న వారికి ఆ భూములపై హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబరులో దరఖాస్తులు స్వీకరించింది. పోడు సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గిరిజనులు, గిరిజనేతరులు హక్కుపత్రాల జారీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల వారీగా అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పూర్తిస్థాయిలో క్రోడీకరించారు.
క్షేత్ర స్థాయిలో ఇలా..
దరఖాస్తుల పరిశీలనను ఎఫ్ఆర్సీల ఆధ్వర్యంలో చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలనలో వారితో పాటు రెవెన్యూ, అటవీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోడు ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారో నిర్ధరించడం కోసం కార్టోశాట్(ఉపగ్రహ) చిత్రాలను వినియోగించారు. పోడు భూముల దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా సర్వేను నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యులు అర్హుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. అర్హులైనవారి పేరున పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించి సిద్దంగా పెట్టుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
63 పంచాయతీల్లో..
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 13 మండలాల్లోని 63 గ్రామ పంచాయతీల పరిధిలో పోడు భూములు ఉన్నాయి. రెండు డివిజన్లలో సుమారు 13,700 ఎకరాల్లో పోడు సాగు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే అధికారుల అంచనాకు మించి దాదాపు 43 వేల ఎకరాల వరకు పోడు భూములకు సంబంధించి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. దేవరకొండ డివిజన్లో 20791 ఎకరాల విస్తీర్ణంలో 4884 మంది గిరిజన రైతులు, 2744 మంది గిరిజనేతరులు దరఖాస్తులు సమర్పించారు. మిర్యాలగూడ డివిజన్లో దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో 8032 మంది గిరిజన రైతులు, 1761 మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.