logo

నేడు ఎన్‌ఐఎన్‌లో ఐఏపీఎస్‌ఎం జాతీయ సదస్సు

బీబీనగర్‌ ఎయిమ్స్‌ కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో నిర్వహిస్తున్న ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) జాతీయ సదస్సును తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రారంభించనున్నారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా బుధవారం ప్రకటనలో తెలిపారు

Published : 02 Feb 2023 05:08 IST

బీబీనగర్‌, న్యూస్‌టుడే: బీబీనగర్‌ ఎయిమ్స్‌ కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో నిర్వహిస్తున్న ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) జాతీయ సదస్సును తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రారంభించనున్నారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా బుధవారం ప్రకటనలో తెలిపారు. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజారోగ్యానికి సంబంధించి ‘వన్‌ హెల్త్‌ వన్‌ ప్లానెట్‌’ అనే అంశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని (తార్నాక) ఎన్‌ఐఎన్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సును వైద్యులు, పరిశోధకులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని