వేతనాలు లేక.. కార్మికులు విలవిల
గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
పంచాయతీ ఖజానాలు ఖాళీ
భువనగిరి పట్టణం, న్యూస్టుడే
మురుగు కాలువను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నేటికీ రెండు నుంచి ఐదు నెలల వేతనాలు రావాల్సి ఉంది. అభివృద్ధి నిర్మాణాలు దేవుడెరుగు, నిర్వహణకు అయ్యే ఖర్చులను కొందరు సర్పంచులు సొంతంగా చెల్లిస్తూ అప్పుల పాలయ్యారు.
జిల్లా పరిధిలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సుమారు 1460 మంది కార్మికులు, 249 మంది మల్టీపర్పస్ కార్మికులు పనిచేస్తున్నారు. మల్టీపర్పస్ కార్మికులకు నెలకు రూ.8,500, కార్మికులకు పంచాయతీ స్థానిక ఆర్థిక వనరులను బట్టి నెలకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు వేతనంగా చెల్లిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ మెన్లు, ఎలక్ట్రిషియన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, కారోబార్లు ప్రధాన భూమికను పోషిస్తున్నారు. చిన్న పంచాయతీలో గరిష్ఠంగా ఇద్దరు, పెద్ద పంచాయతీల్లో 32 మంది వరకు పనిచేస్తున్నారు. గతంలో వీరికి ఎస్ఎఫ్సీ, 14, 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధులు నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు చేపట్టడంతో ఈ నిధులను వేతనాలు, నిర్వహణకు వినియోగించుకునే వీలులేకుండా పోయింది. ప్రస్తుతం కార్మికులు వేతనాలతో పాటు ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్, పైప్లైన్ల మరమ్మతులు ఇతర పనులు చేపట్టలేని పరిస్థితి పంచాయతీల్లో నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిధులు నిర్ణీత వ్యవధిలో మంజూరు చేయడంతో పాటు నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేసుకునే అనుమతిస్తే పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.
నిధులు మంజూరు చేయాలి
-ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సర్పంచుల సంఘం
నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. చిన్న పనులు సైతం చేయలేకపోతున్నాం. కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా కార్మికులు వేతనాలు చెల్లించకపోవడంతో వారికి పని చెప్పలేక పోతున్నాం. ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ ఖర్చు భారంగా మారింది. ఎస్ఎఫ్సీ నిధులు మంజూరు చేయాలి.
మున్సిపల్ కార్మికులతో సమానంగా..
- గడ్డం ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం
పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలి. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయమై పంచాయతీరాజ్ కమిషనర్కు లిఖిత పూర్వకంగా వినతి సమర్పించినా పరిస్థితిలో మార్పులేదు. మున్సిపల్ కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం