వినిపించని కూత.. ఆశలకు కోత
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయింపులు చేయకుండా మొండిచెయ్యే చూపింది.
ఊసేలేని హైదరాబాద్ - విజయవాడ వయా సూర్యాపేట రైలుమార్గం
ఈనాడు, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయింపులు చేయకుండా మొండిచెయ్యే చూపింది. ఎంఎంటీఎస్ రెండోదశ, డబ్లింగ్, హైదరాబాద్ - విజయవాడ మార్గంలో సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్రైళ్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. బీబీనగర్ - గుంటూరు మార్గంలో డబ్లింగ్ నిమిత్తం రూ.60 కోట్లు కేటాయించిన కేంద్రం, పగిడిపల్లి - నల్లపాడు (285 కి.మీ.) మార్గంలో విద్యుద్దీకరణకు రూ.32.8 కోట్లు కేటాయించింది. ఈ రెండు కేటాయింపులు తప్పితే మిగిలిన ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నిరాశే మిగిలింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) తమ పరిధిలోని పలు ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై ఓ నోట్ను విడుదల చేసింది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణలో భాగంగా ఘట్కేసర్ - యాదాద్రి (రాయగిరి ) రైలు మార్గానికి ఈ ఏడాది బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. గత బడ్జెట్లో ఈ మార్గానికి కేవలం రూ.10 లక్షలు కేటాయించి మమ అనిపించిన కేంద్ర సర్కారు ఈ ఏడాదీ ఆ నిధులనూ కేటాయించలేదు.
* రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి రైలుమార్గం కల్పించేందుకు వీలుగా ఎంఎంటీఎస్ రెండో దశను విస్తరించాలని అధికారులు 2016 - 17 బడ్జెట్లో నిర్ణయించారు. ఘటకేసర్ నుంచి 33 కి.మీ. ఈ మార్గాన్ని తొలుత రూ.412 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ అంచనా వ్యయం సుమారు రూ.1300 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టులో మూడింట రెండింతల నిధులు రాష్ట్రం, మిగిలిన ఒక భాగం కేంద్రం సమకూర్చాలని గతంలోనే ఒప్పందం జరిగింది.
* హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వయా సూర్యాపేట, కోదాడ మీదుగా జాతీయ రహదారి 65కి అనుసంధానంగా బుల్లెట్ రైలును నడపాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏటా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ ఉమ్మడి జిల్లా ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు జరిపిన సమావేశాల్లోనూ ఈ ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఈ బడ్జెట్లోనూ ఈ మార్గంలో ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం.
* గుంటూరు రైల్వే డివిజన్లో సరకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్న 56 కి.మీ. విష్ణుపురం (దామరచర్ల) - మోటమర్రి వయా జగ్గయ్యపేట మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడపాలని చాలా రోజుల నుంచి ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఇది గిట్టుబాటు కాదని వెల్లడించిన రైల్వే అధికారులు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీంతో ఈ మార్గం గుండా విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ వాసులకు ఇది నిరాశపరిచేదే.
* ఏళ్లుగా ఊరిస్తున్న బీబీనగర్ - నడికుడి (గుంటూరు) డబ్లింగ్ లైను రెండేళ్ల క్రితం మంజూరైనా.. ఈ 248 కి.మీ. మార్గంలో డబ్లింగ్ పనులకు రూ. 2480 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మూడేళ్ల క్రితమే ఈ మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి కాగా.. ఈ బడ్జెట్లో డబ్లింగ్ పనులకు రూ. 60 కోట్లు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు