రేషన్బియ్యం తరుగునకు చెక్
రేషన్ బియ్యం తరుగునకు ఇక చెక్ పడనుంది. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అమల్లోకి రేషన్ డీలర్లకు బయోమెట్రిక్
నల్గొండ కలెక్టరేట్, గరిడేపల్లి, న్యూస్టుడే: రేషన్ బియ్యం తరుగునకు ఇక చెక్ పడనుంది. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజా పంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల నుంచే రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ అమలు చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు ప్రతి నెల మండలస్థాయి గిడ్డంగికి వెళ్లి తన దుకాణంలోని కార్డుల ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2081 రేషన్ దుకాణాలకు ఈ నెల నుంచి బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
దోపిడీపై ఫిర్యాదులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఎల్ఎస్ కేంద్రాల నుంచి అన్ని రేషన్ దుకాణాలకు బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు. ప్రతి నెల తక్కువగా వస్తున్నాయని, 50 కిలోల బస్తాలో 44-49 కిలోలే ఉంటున్నాయని డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలస్థాయి గోదాముల్లో గన్నీ సంచులకు కావాలనే రంధ్రాలు చేసి బియ్యం కిందపడిపోయే విధంగా చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం డీలర్లకూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు అందులో వేలిముద్ర వేసినప్పుడు ఈ-పోస్కుచ వేయింగ్ యంత్రానికి ఎలా అనుసంధానం చేశారో.. అదే విధంగా ఎంఎల్ఎస్ కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. గతంలో పాఠశాలలకు బియ్యం పంపిణీ చేసినప్పుడు తూకం తక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రధానోపాధ్యాయులకు ఇదే విధానం అమలు చేశారు. హెచ్ఎంలు ఎంఎల్ఎస్ కేంద్రాలకు వెళ్లి రావడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సీఆర్పీలకు బయోమెట్రిక్ అప్పగించారు.
ఇంకా రేషన్ దుకాణాలకు వెళ్లని బియ్యం
డీలర్లకు బయోమెట్రిక్ విధానంలో ఎంఎల్ఎస్ కేంద్రాల్లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో ఒక సారికి 50 క్వింటాళ్ల బియ్యం వరకు తూకం వేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక డీలర్ 250 క్వింటాళ్ల బియ్యం పొందాలంటే అయిదు సార్లు బమోమెట్రిక్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. అదే విధంగా ఒక సారి 50 క్వింటాళ్లు కాంటామీద వేసేందుకు హమాలీలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కాంటాపైన బియ్యం బస్తాల ఎత్తు పెరగడంతో హమాలీలకు కష్టాంగా మారింది. దీంతో నల్గొండ జిల్లాలో 450 చౌకధర దుకాణాలకు, సూర్యాపేటలో 68, యాదాద్రిలో 35 దుకాణాలకు మాత్రమే బియ్యం సరఫరా జరిగింది.
ఈ నెలకు బయోమెట్రిక్ మినహాయింపు
ఎంఎల్ఎస్ కేంద్రాల్లో డీలర్ల బయోమెట్రిక్ విధానం అమలులో సమస్యలు ఏర్పడ్డాయి. సమస్యలను పరిష్కరించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ నెల బియ్యం సరఫరాలో డీలర్ల బయోమెట్రిక్కు మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల బియ్యాన్ని డీలర్ల బయోమెట్రిక్ లేకుండా సరఫరా చేయాలని ఆదేశించింది.
గిడ్డంగికి వెళ్లాల్సిందే
- వెంకటేశ్వర్లు, డీఎస్వో నల్గొండ
ప్రక్రియ ప్రారంభించాం. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో కాంటాల్లో తూకానికి సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే వాటిని అధిగమించి ముందుకెళ్తాం. ప్రస్తుతం ఈనెలకు సంబంధించి ఇప్పటికే 50 శాతం దుకాణాలకు డీలర్ల బయోమెట్రిక్తో బియ్యం సరఫరా చేశాం. జాప్యం ఏర్పతున్నందున ప్రభుత్వం ఈ నెలకు సంబంధించి బయోమెట్రిక్ లేకుండా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల నుంచి డీలర్లు ఎంఎల్ఎస్ కేంద్రాలకు వచ్చి బమోమెట్రిక్ చేసి బియ్యం తూకం చూసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు: కేసీఆర్
[ 25-04-2024]
తెలంగాణకు అన్ని విధాల నష్టం చేసిన భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు.. -
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
[ 25-04-2024]
భువనగిరి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ కలెక్టరేటులోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను సందర్శించారు. -
భువనగిరి లోక్సభ స్థానానికి 61 మంది నామినేషన్లు
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు. -
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా