నైపుణ్య పెంపే లక్ష్యంగా..!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదు. అయితే వీటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు. నైౖపుణ్యాలు పెంచుకోవడం ముఖ్యం.
నల్గొండకు మోడల్ కెరీర్ కేంద్రం మంజూరు
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదు. అయితే వీటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు. నైౖపుణ్యాలు పెంచుకోవడం ముఖ్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నా.. నైపుణ్యాల లేమితో యువత అవకాశాలను అందుకోలేకపోతోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యువతలో నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నల్గొండకు మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ)ను మంజూరు చేసింది. నల్గొండ జిల్లాలో అత్యధిక పరిశ్రమలున్నాయి. రాజధానికి సమీపంలో ఉండటంతో ఐటీ రంగంలోనూ యువత అవకాశాలు దక్కించుకునేందుకు వీలుంది. నైపుణ్యాల లేమితో ఉద్యోగ, ఉపాధిలో వెనుకబడుతున్న నిరుద్యోగులకు ఈ కేంద్రంతో ప్రయోజనం చేకూరనుంది.
ఉపాధి కల్పన కార్యాలయానికి కొత్తరూపు..
మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వటానికి ప్రత్యేక భవనం అవసరం. దానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించింది. నల్గొండలోని ఉపాధి కల్పన కార్యాలయాన్ని విస్తరించితే సెంటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ఆధునికీకరణ చేసేందుకు అంచనాలు రూపొందించారు.
ఉచిత శిక్షణతో ఉపాధికి బాటలు..
మోడల్ కెరీర్ సెంటర్ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. సంస్థలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుండటంతో ఉపాధికి బాటలు పడనున్నాయి. నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నల్గొండకు ఇది మంజూరైంది. యువతకు ఇక్కడ ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వనున్నారు.
యువతకు ఉపయోగకరం
- పద్మ, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారిణి, నల్గొండ
మోడల్ కెరీర్ కేంద్రం ఏర్పాటు యువతకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధి కల్పన కార్యాలయం భవనాన్ని ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ కేంద్రానికి అనుగుణంగా విస్తరింప చేసి ఇందులో నిర్వహిస్తాం. పాలనాధికారి నుంచి పరిపాలన అనుమతులు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్