పత్తిచేన్లో దొంగలు పడ్డారు..!
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పత్తిని భద్ర పరుస్తున్నారు. చాలా మంది రైతులకు ఇళ్ల వద్ద సరైన వసతి లేకపోవడంతో ఆ పత్తిని తమ వ్యవసాయ బావుల వద్ద నిల్వ చేస్తున్నారు.
మునుగోడు, న్యూస్టుడే
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పత్తిని భద్ర పరుస్తున్నారు. చాలా మంది రైతులకు ఇళ్ల వద్ద సరైన వసతి లేకపోవడంతో ఆ పత్తిని తమ వ్యవసాయ బావుల వద్ద నిల్వ చేస్తున్నారు. ఉదయం కాపలా ఉంటున్నప్పటికీ రాత్రివేళ ఉండటం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరూ గుర్తు తెలియని వ్యక్తులు పత్తిని అపహరిస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
* చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన రైతు వర్కాల భిక్షమయ్యకు ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో అతను పండించిన పత్తిని తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న రేకుల షెడ్లో నిల్వ ఉంచాడు. గతేడాది డిసెంబరు 14న గుర్తు తెలియని దుండగులు 25 క్వింటాళ్ల పత్తిని ఎత్తుకెళ్లారు. ఆ పత్తిని నాలుగు చక్రాల వాహనంలోనే ఎత్తుకెళ్లినట్లుగా అక్కడ ఆనవాళ్లు సైతం కనిపించాయి. ఆ పత్తి విలువ సుమారుగా రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
* మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతుల యాదయ్య పండించిన పత్తిని బావి వద్ద ఉన్న రేకుల షెడ్లోనే భద్ర పరిచారు. గుర్తు తెలియని దుండగులు ఈ నెల 18న 15 క్వింటాళ్ల పత్తిని దొంగిలించారు. దాని విలువ సుమారు రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.
* గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు తమ ఇంటి ఆరుబయట సంచుల్లో పత్తిని నిల్వ ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేనిది గుర్తించి అందులో రెండు సంచుల పత్తిని గుర్తు తెలియన వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
* మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన బండారు ప్రహ్లాద తమ వ్యవసాయ బావి వద్ద పత్తిని భద్రపర్చాగా.. అందులో నుంచి రెండు బోరాలను జనవరి 25న ఎత్తుకెళ్లారు.
* మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన మేకల సైదులు తన చేను వద్ద ఉన్న షెడ్లో పత్తిని నిల్వ ఉంచాడు. అందులో నుంచి రెండు బోరాలలో ఉన్న పత్తిని ఫిబ్రవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు సైదులు స్థానికంగా ఉన్న వేబ్రిడ్డి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరూ యువకులు తీసుకువచ్చి అక్కడ ఉన్న దళారులకు అమ్మినట్లుగా గుర్తించారు. మరుసటి రోజూ ఆ ఇద్దరూ యువకులు మరో రెండు బోరాలలో పత్తిని తెచ్చి అమ్ముతుండగా గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు