మరణంవైపే.. మనసు పయనం
వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి హత్యలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు ఎక్కువగా ఉండేవి.
పెరిగిపోతున్న వివాహేతర, భూతగాదాల హత్యలు
సూర్యాపేట నేరవిభాగం, నల్గొండ నేరవిభాగం, భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే
వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి హత్యలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబ సభ్యులు దిక్కులేని వారుగా మారుతున్నారు. జీవితాలను చీకటిమయంగా మార్చుకుంటున్నారు. తల ఎత్తుకోలేక కొంత మంది ఉన్న ఊరినే వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంత మంది అక్రమ సంబంధాల ఏర్పాటు చేసుకొని దారుణాలకు ఒడిగడుతుంటే.. మరికొందరు ఆస్తుల కోసం రక్త సంబంధీకులనే బలి తీసుకుంటున్నారు.
ఘటనలు ఇలా..
* నల్గొండ జిల్లా కేంద్రంలోని గంగవారిగూడెం రోడ్డులో ఆరు నెలల క్రితం చిన్న గట్టు తగాదాలో సొంత తమ్ముడి కుమారులే పెద్దనాన్నను హత్య చేశారు. అదే తగాదాలో మరుసటి రోజే ప్రతీకారంగా మృతుడి కుమారుడు చిన్నాన్నను హత్య చేశాడు.
పెద్దమనుషుల్లో కూర్చొని చర్చించుకుంటే సమసిపోయే చిన్న వివాదం ఇద్దరు కుటుంబ పెద్దలను కోల్పోవాల్సి రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
* ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన గుండ్లపల్లి వీరయ్య (40)ను అదే గ్రామంలో దాయాది కుటుంబానికి చెందిన గుండ్లపల్లి నర్సయ్య ఇరవై రోజుల క్రితం దారుణంగా హత్య చేశాడు. పొలం వద్ద నిద్రిస్తుండగా గొడ్డలితో తల, మొండెం వేరు చేసి హతమార్చాడు. వీరయ్య హత్యకు అక్రమ సంబంధమే కారణమని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవేశంలో నిర్ణయం తీసుకొని హత్య చేసినట్లు నర్సయ్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
* భువనగిరి పట్టణం తాతానగర్కు చెందిన వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో భర్త తినే ఆహారంలో విషం కలిపి హత్య చేశాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటనతో వీరి కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఈ కేసులో హతురాలి తల్లి సైతం నిందితురాలిగా ఉండటం గమనార్హం.
* ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్లో ఏడాది క్రితం ఆస్తి పంపిణీ చేయడం లేదన్న కోపంతో అన్న, తమ్ముడు కలిసి కన్న తండ్రిని హతమార్చారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఇదే మండలం ఏనుబాములలోనూ పది నెలల క్రితం ఇదే తరహాలో కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురయ్యాడు.
తొందరపాటు సరికాదు
డాక్టర్ శివరామకృష్ణ, మానసిక వైద్య నిపుణులు, నల్గొండ
ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా కొందరు క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే వాటికి హత్యలకు పాల్పడుతూ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. హత్యలకు గురవుతున్న వారిలో ఎక్కువగా దగ్గరి సంబంధీకులే ఉంటున్నారు. ఒకరికి మించి వివాహేతర సంబంధాలు కొనసాగించడం కొందరు గొప్పగా ఫీలవుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పరువు పోయి ఏం చేయాలో తెలియక హత్యలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు సమీపంలోని మాససిక వైద్యులను సంప్రదిస్తే సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM