logo

ప్రణాళిక ద్వారానే జిల్లా అభివృద్ధి: బండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న నిధులు ప్రణాళికా బద్ధంగా ఖర్చు చేస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.

Published : 21 Mar 2023 05:24 IST

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న నిధులు ప్రణాళికా బద్ధంగా ఖర్చు చేస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన 15వ ఆర్థిక సంఘం 2023-24 ఏడాదికి సంబంధించిన ప్రణాళిక రచన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పనులను ఎంపిక చేసే విధంగా ప్రణాళిక ఉండాలని సూచించారు. జడ్పీ సీఈవో ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, డీపీవో విష్ణువర్ధన్‌, ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని