logo

టీఎస్‌పీఎస్సీ లీకేజీపై భాజపా నిరసన దీక్ష

టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భాజపా ఆధ్వర్యంలో స్థానిక పెద్దగడియారం చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు.

Published : 21 Mar 2023 05:24 IST

నల్గొండ: పెద్దగడియారం చౌరస్తా వద్ద నిరసన దీక్షలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌

నీలగిరి, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భాజపా ఆధ్వర్యంలో స్థానిక పెద్దగడియారం చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఉద్యోగ నియామక పరీక్షలు సహితం సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సాంకేతికత పేరుతో ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం సభ్యులందరికీ ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కిసాన్‌ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్‌, పురపాలిక ప్లోర్‌ లీడర్‌ ప్రసాద్‌, నాయకుల కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, వర్షిత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, యాదగిరాచారి, సాంబయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని