క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి తలసాని
క్యూనెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు.
క్యూనెట్ బాధితులతో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: క్యూనెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం సికింద్రాబాద్ వెస్ట్మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో ఆయన్ను క్యూనెట్ బాధితులు కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో క్యూనెట్ సంస్థ కొనసాగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉద్యోగావకాశాల పేరిట వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన 60 మంది వద్ద.. రూ. లక్షన్నర నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలుచేసిందని వివరించారు. స్పందించిన మంత్రి.. క్యూనెట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత సంస్థ నిర్వహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని మహంకాళి ఠాణా పోలీసులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం