పట్టు పట్టారు.. పరీక్షలో నెగ్గారు
ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా చదువుల్లో మరింతగా రాణించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్-ఎన్ఎంఎంఎస్) అందజేస్తోంది.
ఎన్ఎంఎంఎస్లో ‘పేట’ నంబరు-2 పాఠశాల విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్టుడే: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా చదువుల్లో మరింతగా రాణించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్-ఎన్ఎంఎంఎస్) అందజేస్తోంది. ఈ ఉపకార వేతనం అందుకోవాలంటే ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ప్రతిభ చాటాలి. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తుంది. సూర్యాపేట పట్టణంలోని నంబరు-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభా పరీక్షలో నాలుగేళ్ల నుంచి ఎంపికవుతున్నారు. ఇక్కడ చదువుతున్న తమ పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా గొప్పగా చెబుతున్నారు.
సన్నద్ధత ఇలా..
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చొరవతో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉపకార వేతన పరీక్షలో నెగ్గేలా ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ గంటన్నర పాటు అదనపు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులతో నోట్స్ రాయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠం చివర ఉన్న ప్రశ్నలను సాధన చేయిస్తున్నారు. ఓఎంఆర్ షీట్స్పై తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే కాకుండా కొత్తగా ఎలాంటివి వస్తాయే ఉపాధ్యాయులు అంచనా వేసి చెబుతుండటంతో అనుకున్న ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లోనూ ఈ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. విజేతల మనోగతం వారి మాటల్లో..
జిల్లాలో పదో ర్యాంకు సాధించా
- ఎం.రీతికారెడ్డి, విద్యార్థిని
రోజూ పాఠశాలలో బోధించిన అంశాలపై నోట్స్గా తయారు చేసుకొని చదివాను. అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించాం. నాతో పాటు మిగిలిన విద్యార్థులూ ఉపాధ్యాయులు తయారు చేసిన నోట్స్ ఆధారంగా సన్నద్ధమయ్యారు. నాకు 180 మార్కులకు గాను 125 వచ్చాయి. జిల్లాలో పదో ర్యాంకు కైవసం చేసుకున్నాను. ఇంటర్ వరకు ఏటా అందే ఉపకార వేతనం నా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది.
రోజూ పునఃశ్చరణ చేసుకున్నా..
- పి.తేజ, విద్యార్థి
ఈసారి నిర్వహించిన జాతీయ ప్రతిభా పరీక్షలో 93 మార్కులు సాధించాను. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు బోధించిన ప్రతి అంశాన్ని రోజూ చదివాను. పునఃశ్చరణ చేసుకోవడం వల్ల పరీక్షల్లో ప్రతిభ చూపాను.
సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు
- అంకటి వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు, నంబరు-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట
ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాం. సబ్జెక్ట్ ఉపాధ్యాయులు సొంతంగా నోట్స్ తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి మా పాఠశాల విద్యార్థులు ఎన్ఎంఎంఎస్లో అర్హత సాధిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
- ఆర్.రిషికేశవ, విద్యార్థి
జాతీయ ఉపకార వేతనాలకు అర్హత సాధిస్తే నాలుగేళ్లుగా ఆర్థికసాయం అందుతుందని మా నాన్న అవగాహన కల్పించారు. రోజూ ఇంటి వద్ద సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించారు. ఉపాధ్యాయుల సూచనలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని చదివాను.. సందేహాలను పాఠశాలలో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకున్నా. 180 మార్కులకు గాను 103 మార్కులు సాధించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి