పదాలలో కదిలేది.. హృదయాలను కదిలించేది.. కవిత్వం
జానపదుల నోటి నుంచి అలవోకగా దూకిన పాట మొదలు ఈనాటి కొంగొత్త ప్రక్రియల వరకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వస్తుంది తెలుగు కవిత్వం. పద్యం, గేయం, వచనం ఇలా..
నేడు ప్రపంచ కవితా దినోత్సవం
మోత్కూరులో ప్రజాభారతి ఆధ్వర్యంలో ఇటీవల మోదుగురేకులు గ్రంథావిష్కరణలో పాల్గొన్న కవులు
మోత్కూరు, న్యూస్టుడే: జానపదుల నోటి నుంచి అలవోకగా దూకిన పాట మొదలు ఈనాటి కొంగొత్త ప్రక్రియల వరకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వస్తుంది తెలుగు కవిత్వం. పద్యం, గేయం, వచనం ఇలా.. ముప్పేట అల్లుకుంది తెలుగు కవిత్వం. ముఖ్యంగా ఆధునిక తెలుగు కవిత్వం భిన్న పాయలుగా పారుతూ బీడు భూముల వంటి మస్తిష్కాలను ఉత్తేజపరుస్తోంది. ఇటీవల వాట్సాప్ మాధ్యమం ద్వారా ప్రచారంలోకి వచ్చిన ‘ఏకవాక్య కవిత్వం’ కూడా తనదైన గొంతుకను వినిపిస్తోంది.
సామాజిక చైతన్య వేదికలు...
మారుతున్న కాలానికి అనుగుణంగా.. సామాజిక మాధ్యమాలు కవితలకు, సాహిత్య వ్యాప్తికి చక్కని వేదికలుగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్ వేదికలుగా చేసుకుని వందలాది మంది కవులు అనునిత్యం తమ కవితలను వెదజల్లుతున్నారు. కరోనా సమయంలో వాట్సాప్ వేదికలుగా కవితా పోటీలను కూడా నిర్వహించడం విశేషం. ప్రతీరోజు వందలాది కవితలు, వాట్సాప్ గ్రూపుల్లో తెలుగు సాహిత్య పరిమళాలను వెదజల్లుతుంటే వీటిని చూసి ప్రశంసించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త కవులకూ ఈ సామాజిక మాధ్యమాలు రాచబాట వేస్తున్నాయి.
సాహిత్య సేవలో..
తెలుగు సాహిత్య సేవలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక సాహితీ సంస్థలు, కవులు, రచయితలు తెలుగుకు వెలుగునిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కవి దిగ్గజాలుగా పేరొందిన అనేక సాహితీమూర్తులకు వేదిక ఈ నల్గొండ జిల్లా. డాక్టర్ ఎన్.గోపి, డాక్టర్ దేవరాజు మహారాజు, డాక్టర్ రవ్వా శ్రీహరి, సీవీ కృష్ణారావు, డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి, డాక్టర్ రావి ప్రేమలత, డాక్టర్ శ్రీరంగచార్య, డాక్టర్ ఎన్.లక్ష్మణమూర్తి, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యులు, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, డాక్టర్ కాసుల లింగారెడ్డి, అలుగుబెల్లి రాంచంద్రారెడ్డి, డాక్టర్ తిరునగరి, డాక్టర్ ఎన్.రఘు, వేణు సంకోజు, డాక్టర్ లింగ అరుణమ్మ, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, లెక్కల మల్లారెడ్డి, వనం సావిత్రినాథ్, దాసోజు పద్మావతి, నిఖిలేశ్వర్, కాసుల ప్రతాపరెడ్డి, బందారు సుజాతా శేఖర్, గంజి భాగ్యలక్ష్మీ, ఉప్పల పద్మ, బండారు జయశ్రీ, మర్రి జయశ్రీ, వల్లాల విజయలక్ష్మీ ఇలా.. వందలాదిమంది కవులు తమ సాహిత్యంతో జిల్లాకు పేరు తెచ్చిపెడుతున్నారు.
* జిల్లాలోని అనేక సాహితీ సంస్థలు తెలుగు వైభవాన్ని చాటేందుకు తమదైన తీరులో కృషి చేస్తున్నాయి. భారతి సాహిత్య సాంస్కృతిక వేదిక, సృజన సాహితి, నీలగిరి, కోమలి కళాసమితి, నీలగిరి కళాసమితి, అక్షర కళాభారతి, తేజ ఆర్ట్స్ క్రియేషన్స్, ప్రజాభారతి, మల్లెల భారతి, భువనభారతి, జయమిత్ర, చైతన్య కళా శ్రవంతి, సాహితీ స్నేహితులు... ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, దేవరకొండ, నకిరేకల్, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, మోత్కూరు తదితర ప్రాంతాల్లో తరుచూ సాహిత్య కార్యక్రమాలు, ఉగాది కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, పురస్కారాల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలతో తెలుగు సాహిత్యానికి జీవం పోస్తున్నాయి.
నానీల రూపశిల్పి డాక్టర్ ఎన్.గోపి
త్రిపదలు సృష్టికర్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యులు
ఏకవాక్య ప్రక్రియను ఆవిష్కరించిన దేవినేని అరవిందరాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. -
కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి: క్యామ మల్లేష్
[ 23-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు