ఆర్టీసీ బస్సు ఢీకొని న్యాయవాది దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి చెందిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో చోటుచేసుకుంది.
సముద్రాల పృథ్వీ చక్రవర్తి
చౌటుప్పల్గ్రామీణం, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి చెందిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన సముద్రాల పృథ్వీ చక్రవర్తి(53) ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లారు. స్నేహితుని తండ్రి దశదిన కర్మ ఉండటంతో కారులో తోటి స్నేహితులతో కలిసి వెళ్లి రాత్రి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కు వద్దకు రాగానే మూత్రవిసర్జన కోసం జాతీయరహదారి పక్కనే కారును నిలిపారు. కారు ఎక్కే క్రమంలో సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తూ పృథ్వీ చక్రవర్తిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది. న్యాయవాదిగా మానవ హక్కుల కోసం పని చేశాడు. జువైనల్ రిసెర్చ్ ఫోరంను స్థాపించి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేశాడు. మృతుని బావ కృష్ణన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నీటి సంపులో పడి చిన్నారి మృతి
రామన్నపేట, న్యూస్టుడే: నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం రామన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రామన్నపేటకు చెందిన కందుల వేణు, శ్రవంతిల దంపతుల 18 నెలల కుమారుడు నిహాల్ సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సంపులో పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.