నకిలీ మావోయిస్టుల అరెస్టు
మావోయిస్టులమని బెదిరించి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తిప్పిరెడ్డి సుదర్శన్రెడ్డి, సుంచు మల్లేష్ను సోమవారం ఉదయం అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటగిరి, సీఐలు రాఘవేందర్, నరసింహారావు
మిర్యాలగూడ, న్యూస్టుడే: మావోయిస్టులమని బెదిరించి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తిప్పిరెడ్డి సుదర్శన్రెడ్డి, సుంచు మల్లేష్ను సోమవారం ఉదయం అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మిర్యాలగూడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్రెడ్డి 1996 నుంచి 1998 వరకు జనశక్తి సంస్థ కొరియర్గా పనిచేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత 2001లో ప్రభుత్వం నుంచి ఆయుధ లైసెన్సు పొంది హైదరాబాద్ హబ్సిగూడలో నివాసం ఉంటూ రియల్ వ్యాపారం సాగించాడు. ఇందులో భారీగా నష్టాలు వచ్చాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మేడ్చల్ జిల్లా జవహర్నగర్కు చెందిన సుంచు మల్లేష్తో చేతులు కలిపాడు. ఇద్దరు కలిసి వ్యాపారులపై బెదిరింపులకు దిగారు. వీరిపై పలు కేసులు నమోదు కాగా ఇద్దరిని గతంలో పోలీసులు అరెస్టుచేశారు. ఇటీవల మిర్యాలగూడ రైస్మిల్లర్స్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్కు ఫోన్చేసి తాము మావోయిస్టులమని బెదిరించి రూ.5 లక్షలు ఇవ్వాలని లేనిచో చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన గౌరు శ్రీనివాస్ ఈనెల 18న ఆన్లైన్లో రూ.10వేలు పంపాడు. మిగతా డబ్బుల కోసం సోమవారం ఉదయం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండుకు వచ్చి గౌరు శ్రీనివాస్కు ఫోన్చేశారు. ముందస్తు సమచారంతో పోలీసులు నిఘా పెట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించినన సీఐ రాఘవేందర్, ఎస్సై లు సైదిరెడ్డి, కృష్ణయ్య హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య కానిస్టేబుళ్లు, వెంకటేశ్వర్లు, రామకృష్ణలను డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ