రాలింది కాత.. అన్నదాతకు గుండెకోత
జిల్లాలో మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద.. మరో వైపు వడగళ్ల వర్షాలు కోలుకోని దెబ్బతీశాయి
నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులు
తిరుమలగిరి మండలం మామిడాలలో నేలరాలిన మామిడి కాయలను పరిశీలిస్తున్న డీఏవో డి.రామారావునాయక్, ఏవో డి. వెంకటేశ్వర్లు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద.. మరో వైపు వడగళ్ల వర్షాలు కోలుకోని దెబ్బతీశాయి. తెగుళ్ల వల్ల బాగా కాసిన పూత రాలిపోగా.. దక్కిన కొన్ని కాయలు వానపాలయ్యాయి. రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు.. ఈ సారైనా ఆశించిన స్థాయిలో లాభాలను చూడాలనుకున్నారు. కాత అధికంగా ఉందని, ధరలుంటే కలిసి వస్తుందనుకునే లోపు అకాల వర్షాలు నిండాముంచాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
1300 ఎకరాల్లో నష్టం
జిల్లాలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేపట్టారు. ప్రధానంగా తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, నూతనకల్, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), అర్వపల్లి మండలాల్లో అధికంగా సాగవుతోంది. గతంలో తెగుళ్ల కారణంగా కొంత వరకు నష్టపోగా.. ఇటీవల రెండ్రోజులు కురిసిన వడగళ్ల వర్షానికి 1300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వర్షం వల్ల రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. వడగళ్ల ధాటికి చెట్టు మీద ఉన్న కాయ కూడా నల్లబారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్ పరిస్థితులను చూస్తే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత దశ దాటి కాత వచ్చే సమయంలో తామర పురుగుతోపాటు ఇతర తెగుళ్ల నివారణకు ఇబ్బడిముబ్బడిగా పురుగు మందు పిచికారి చేశారు. ఒక్కో రైతు ఒక్కసారికి సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికే అయిదుసార్లు పురుగు మందులు పిచికారి చేసినా ఆశించిన ఫలితం కానరావడం లేదు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం కనీసం రెండు, మూడు టన్నులూ వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
నష్టాన్ని అంచనా వేశాం
- శ్రీధర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి, సూర్యాపేట
వడగళ్ల కారణంగా దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించాం. రైతులతో మాట్లాడి నష్టాన్ని అంచనా వేశాం. ఈ సారి కాత బాగుంది. కానీ, వడగళ్ల కారణంగా చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి. చెట్టు మీది కాయలపై వడగళ్లు పడటంతో నల్లబారే అవకాశం ఉంటుంది. దీంతో నష్టం పెరగవచ్చు. పంట నష్టంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు