మెరుగైన ర్యాంకు కోసం..!
విభిన్న కోర్సులు, నాణ్యమైన విద్యా బోధన, అన్ని వసతులు, పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణంతో నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను చాటుతోంది.
త్వరలో ఎంజీయూలో న్యాక్ బృందం పర్యటన
నల్గొండ టౌన్, న్యూస్టుడే
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
విభిన్న కోర్సులు, నాణ్యమైన విద్యా బోధన, అన్ని వసతులు, పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణంతో నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను చాటుతోంది. 2007లో నల్గొండ పరిధిలోని అన్నెపర్తి వద్ద ఏర్పాటైన ఈ వర్సిటీ అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. వర్సిటీలో చదివేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 22 కోర్సుల్లో సుమారు 1800 వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బి గ్రేడ్ గుర్తింపుతో కొనసాగుతున్న విశ్వవిద్యాలయం.. న్యాక్ మెరుగైన ర్యాంకు కోసం తపిస్తోంది. త్వరలో వర్సిటీకి న్యాక్ బృందం రానుంది.
ఎంజీయూలో యాంఫి థియేటర్
కోర్సులు ఇవే..
ఎంకాం, ఎంబీఏ జనరల్, ఎంబీఏ టూరిజం, ఐఎంబీఏ, బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంసీఏ, ఎంఏ ఆంగ్లం, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, టూరిజం, ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్, ఎంఎస్డబ్ల్యూ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ బాటని, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఎంపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివిధ సబ్జెక్టులో 60 మంది విద్యార్థులు ఆయా అధ్యాపకుల వద్ద పీహెచ్డీ పరిశోధనలు సైతం చేస్తున్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్
అభివృద్ధి కార్యక్రమాలు
* స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంజినీరింగ్ కళాశాల భవనం, యాంపి థియేటర్, పరీక్షల నియంత్రణ కార్యాలయ భవనం, ఉపకులపతి, అధ్యాపకుల నివాసాలు నిర్మాణాలు పూర్తి.
* సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలో లిప్ట్లు, పార్కింగ్ షెడ్డులు ఏర్పాటు.
* ఆర్ట్స్ కళాశాల భవనంపై రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు.
* బాలురు, బాలికల అదనపు వసతి గృహాల భవనాల నిర్మాణం.
సౌర విద్యుత్తు కేంద్రం
600 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన
ఈ విద్యా సంవత్సరం వర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సుమారు 50కి పైగా వివిధ కంపెనీలతో ఉద్యోగ మేళాలు నిర్వహించి సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎంపికైన విద్యార్థులు ఐటీ, ఫార్మా, బ్యాంక్స్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందారు.
ప్రయోగశాల
50 వేల పుస్తకాలతో గ్రంథాలయం
ఎంజీయూలో అతిపెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. సుమారు 50 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం అకడమిక్ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయం మొత్తం డిజిటలైజ్డ్ చేశారు. ఏ పుస్తకం కావాలన్నా కంప్యూటర్లో చిటికెలో వెదుక్కునే అవకాశం ఉంది.
మెరుగైన ర్యాంకు ఆశిస్తున్నాం
- ఆచార్య గోపాల్రెడ్డి, ఎంజీయూ వీసీ
ప్రస్తుతం వర్సిటీ బి గ్రేడ్తో కొనసాగుతోంది. ఈ గ్రేడ్ మెరుగుపర్చుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నాం. త్వరలో వర్సిటీలో న్యాక్ బృందం సందర్శించనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. వర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులేమి రాకున్నా వర్సిటీ అంతర్గత నిధులతోనే అభివృద్ధి చేస్తూ వస్తున్నాం.
వర్సిటీలో సౌకర్యాలు మెరుగయ్యాయి
- ప్రియాంక, బీటెక్ ఫైనల్ ఇయర్
గతంలో వర్సిటీలో సమస్యలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం తక్కువగా సమస్యలున్నాయి. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉండడంతో మాకు ఇబ్బందులు లేకుండా అయింది. హాస్టల్లో వసతులు మంచిగానే ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంతో విద్యార్థులకు ఆటలపై ఆసక్తి పెరిగింది. ఎన్ఎస్ఎస్ విభాగాల అమలు బాగుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు