logo

రాహుల్‌కు జైలు శిక్షపై పార్టీ శ్రేణుల నిరసన

పరువునష్టం కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు గురువారం రాత్రి నిరసన తెలిపారు.

Published : 24 Mar 2023 04:44 IST

రాహుల్‌గాంధీ జైలు శిక్షకు నిరసనగా కాంగ్రెస్‌ నాయకుడు రెబల్‌ శ్రీను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు
యత్నిస్తుండగా అడ్డుకుంటున్న ఆ పార్టీ నాయకులు

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: పరువునష్టం కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు గురువారం రాత్రి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు. పార్టీ నాయకుడు రెబల్‌ శ్రీను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్‌రావు, కోతి గోపాల్‌, బైరు శైలేందర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని