పనులు చేస్తూ.. ప్రాణాలు విడుస్తూ
జాతీయ రహదారి వెంబడి, విభాగిని(డివైడర్)ల మధ్య ఉండే మొక్కలు, చెట్ల సంరక్షణ పనులు చేస్తున్న క్రమంలో కూలీలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.
గాలిలో దీపంలా మొక్కల సంరక్షణ కూలీల భద్రత
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే
మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి- 65పై శనివారం మొక్కల సంరక్షణ పనుల్లో ఉన్న ట్రాక్టర్ను వెనకాల నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది మార్చి 6న వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులో విభాగిని మధ్యలో మట్టి పనుల్లో ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రాయగిరికి చెందిన తోడికోడళ్లు, భార్యాభర్తలు మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం నుంచి పనిచేసి మరో గంటయితే ఇంటికి బయలుదేరే సమయానికి విధి పగబట్టినట్లు వీరిని కబలించింది.
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద విభాగిని మధ్యలో మొక్కలకు నీళ్లు పడుతున్న ట్రాక్టర్ ట్యాంకర్ను ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.
జాతీయ రహదారి వెంబడి, విభాగిని(డివైడర్)ల మధ్య ఉండే మొక్కలు, చెట్ల సంరక్షణ పనులు చేస్తున్న క్రమంలో కూలీలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. కూలీలపైకి ఇతర వాహనాలు మృత్యురూపంలో దూసుకొస్తున్నాయి. పనులు చేసే క్రమంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, గుత్తేదారు సంస్థ సరైన నిబంధనలు పాటించకపోవడం కూలీల పాలిట శాపంగా మారుతోంది. ప్రమాదం జరిగినప్పుడు బాధితుల కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ఇవ్వడం.. తర్వాత పనులు చేయించే క్రమంలో నిబంధనలు విస్మరించడం సాధారణమన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ, రాష్ట్రీయ రహదారుల నిడివి ఎక్కువ. నాలుగు వరుసల రహదారుల మధ్య విభాగినులపై నాటిన మొక్కల సంరక్షణ పనులు చేసే క్రమంలో సరైన భద్రత చర్యలు పాటించకపోవడం పొట్ట కూటి కోసం పనులకు వస్తున్న కూలీలకు శాపంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి పనులు చేస్తున్న సమయంలో ఎక్కడో ఓ చోట కూలీలపైకి వాహనాలు దూసుకొస్తున్నాయి.
హెచ్చరికలు, సూచనలు లేకుండానే..
జాతీయ రహదారిపై ఏవైనా మరమ్మతులు, మొక్కల సంరక్షణ చర్యలు చేస్తున్న క్రమంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేసి అదే దారిలో వస్తున్న వాహనాలను అప్రమత్తం చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా కూలీలతో పనులు చేయిస్తున్నారు. వాహనాల అతివేగం, అవగాహన రాహిత్యం కూలీల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. జాతీయ రహదారి మరమ్మతులు, ఇతర పనులు చేపట్టేటప్పుడు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాలి. వేగంగా వెళ్తున్న వాహనాలు నెమ్మదించేలా, పక్క నుంచి వెళ్లేలా 200 మీటర్ల దూరంలో రబ్బరకోన్లు ఏర్పాట్లు చేయాలి. సిబ్బంది ఎరుపు జెండా పట్టుకొని వాహనాల చోదకులను అప్రమత్తం చేయాలి. రహదారి మధ్యలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు నిలిపి పని చేసే సమయంలో ఆ దిశగా వచ్చే వాహన చోదకులకు స్పష్టంగా కనిపించేలా దూరంలోనే హెచ్చరిక, సూచన బోర్డు ఏర్పాటు చేయాలి. కూలీలు పనిచేసేటప్పుడు ఎరుపు రంగు ఆఫ్రాన్ ధరించాలి. పనులు చేస్తున్న వాహనం చుట్టూ రబ్బరు కోన్లు అమర్చాలి.
ప్రమాదాల నివారణ చర్యలేవి..
రహదారిపై కూలీలతో పనులు చేయిస్తున్న సమయంలో గుత్తేదారు, అధికారులు సాధారణ నిబంధనలను విస్మరిస్తున్నారు. విభాగిని మధ్యలోని మొక్కలకు నీళ్లు పోయడం, వాటి సంరక్షణ చర్యలు చేపట్టడం వంటి పనుల క్రమంలో రహదారి వెంట వెళ్లే వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. మొక్కలకు నీళ్లు పట్టడానికి ట్యాంకర్ కాకుండా బిందుసేద్యం లాంటి పద్ధతులు పాటించే అవకాశమున్నా ఆ దిశగా ఆలోచించడం లేదు.
ట్రాక్టరు, లారీ ఢీ.. ఇద్దరు మహిళల మృతి
ఆకుపాముల (మునగాల గ్రామీణం), న్యూస్టుడే: జీవనోపాధికి వెళ్లిన కూలీలు పని చేస్తుండగా లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయరహదారి-65పై శనివారం జరిగింది. స్థానికులు, ఎస్సై పి.లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం రామాపురానికి చెందినవారు జాతీయ రహదారిపై జీఎమ్మార్ సంస్థలో కూలీలుగా పనులు చేస్తున్నారు. ఆకుపాముల వద్ద ఎనిమిది మంది పని చేస్తున్నారు. ఆకుపాముల శివారులో నిలిపి ఉన్న ట్రాక్టర్లోకి కూలీలు చెత్త వేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టడంతో నేలమర్రి వినోద(30) తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తుమ్మల ధనమ్మ, చెవుల రోశమ్మ, కోదాడ మండలం మంగలితండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దాస్లకు తీవ్రగాయాలు కాగా 108లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తుమ్మల ధనమ్మ(55) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. చెవుల రోశమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఘటనా స్థలాన్ని ఎసీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలమర్రి వినోద భర్త తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.లోకేశ్ వెల్లడించారు. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ పరారయ్యాడని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట కోదాడ డీఎసీ వెంకటేశ్వరరెడ్డి, మునగాల సీఐ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.
నేలమర్రి వినోద
తుమ్మల ధనమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
[ 24-04-2024]
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. -
భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
[ 24-04-2024]
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM