సమాజ సేవలో మేముసైతం
విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ను ప్రారంభించారు.
జాతీయ శిబిరాల్లోనూ పాల్గొంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
సూర్యాపేట ఎస్సీ డిగ్రీ కళాశాల ఆవరణలో చెత్తను తొలగిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్టుడే:
విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ను ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మేముసైతం అంటూ సమాజసేవలో తరిస్తున్నారు. చదువుతోపాటు సామాజిక సేవకు ఉపయోగపడే పలు కార్యక్రమాల్లో పాల్గొని తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏటా నిర్వహించే శిబిరాల్లో రక్తదానం, స్వచ్ఛభారత్, శ్రమదానం, హరితహారం, కరోనా సమయంలో అన్నదానం, మాదక ద్రవ్యాల నివారణ, ఓటుహక్కు నమోదు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తారు. తమ కళాశాలలో సైతం ప్రముఖ నాయకుల జయంతి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా బతుకమ్మ సంబురాలు, బాలికా, యోగా దినోత్సవాల నిర్వహణ, కళాశాల ఆవరణను పరిశుభ్రం చేసి చెత్తాచెదారాలను తొలగించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
క్రమశిక్షణ అలవడుతోంది
లింగాల నాని, బీఏ తృతీయ సంవత్సరం
ఎస్ఎస్ఎస్తో క్రమశిక్షణ అలవడుతోంది. శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించడం అలవాటుగా మారుతాయి. ఈ ఏడాది హరియాణాలోని కురుక్షేత్ర యూ నివర్సిటీలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్Â శిబిరానికి హాజరయ్యాను. ఇటీవల నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహించిన జీ20, వై20, ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్-2023 శిబిరాల్లోనూ పాల్గొన్నా.
వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు
మేంతబోయిన ఆనంద్,బీఎస్సీ తృతీయ సంవత్సరం
ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజాభివృద్ధికి నావంతు కృషి చేస్తున్నాను. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు.
జాతీయ శిబిరాల్లో మన సంప్రదాయాలు వివరించా
నాగిరెడ్డి పావని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తృతీయ సంవత్సరం
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇది ఓ వేదికగా నిలుస్తోంది. నేషనల్ ఇంటిగ్రేషన్లో భాగంగా కర్ణాటకలోని దార్వడ్లో గల కర్ణాటక యూనివర్సిటీలో జరిగిన శిబిరానికి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తరపున హాజరయ్యాను. అక్కడ జరిగిన ఏడు రోజుల కార్యక్రమాల్లో మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేశాను. ముఖ్యంగా ఈ శిబిరంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.