logo

రైలు ఢీకొట్టడంతో ఉద్యోగి మృతి

విధులు నిర్వహిస్తుండగా రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని వంగపల్లి రైల్వే ట్రాక్‌పై శనివారం చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 04:45 IST

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: విధులు నిర్వహిస్తుండగా రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని వంగపల్లి రైల్వే ట్రాక్‌పై శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్‌కు చెందిన దశరథం(44) వంగపల్లి రైల్వే స్టేషన్‌ పరిధిలో సిగ్నల్‌ మెయింటెనె విభాగంలో గ్రేడ్‌-1 పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన బృందంతో కలిసి ట్రాక్‌పై సిగ్నలింగ్‌కు సంబంధించిన విధులు నిర్వహిస్తుండగా దిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు అతనిని ఢీకొట్టింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని