ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి: మంత్రి
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో గ్రామాలు అద్భుత ప్రగతి సాధించాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్రెడ్డి,
వేదికపై జడ్పీ అధ్యక్షులు బండ నరేందర్రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో గ్రామాలు అద్భుత ప్రగతి సాధించాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాలు-2023 (దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు) ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 81 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి జాతీయ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ విజన్తో అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్తో పాటు పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయని వివరించారు. దేశంలోని 1.50 లక్షల గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం 20 అవార్డులు ప్రకటిస్తే అందులో రాష్ట్రంలోని 19 పంచాయతీలు ఉండటం గర్వకారణమని చెప్పారు. ఈ సారి సర్పంచులుగా పని చేసిన వారు అదృష్టవంతులని, నిర్విరామంగా చేసిన పని వల్ల గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి చెందాయని, రహదారులు, పల్లెపకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో 200 కోట్ల మొక్కలు నాటి పర్యావరణంలో దేశంలోనే తక్కువ కాలంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. సర్పంచులు, కార్యదర్శులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు నిబద్ధతతో చేసిన కృషితో అభివృద్ధి సాధ్యమైందన్నారు. సమష్టి కృషి వల్ల రాష్ట్రం దేశంలోనే సగర్వంగా తలెత్తుకుని అభివృద్ధి సాధించిందని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు సీఎం ముందు చూపునకు నిదర్శనమని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న మాదిరిగా దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, 2014కు ముందు గ్రామాలు, ఇప్పటి గ్రామాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన 81 గ్రామ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. 9 ఎంపిక చేసిన అంశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ పురస్కారాలు అందచేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లాల సర్పంచులు, కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొత్తం 81 అవార్డులను మంత్రి అందజేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎస్.వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఖుష్భూగుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, దీపక్ తివారి, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ