మహిళల ఆరోగ్యానికి భరోసా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకం ఉమ్మడి జిల్లాలో అతివలకు ఉపయోగకరంగా ఉంది.
అందుబాటులోకి ప్రత్యేక వైద్య సేవలు
నల్గొండలోని మాన్యంచెల్క ఆసుపత్రిలో మహిళకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది
నల్గొండ అర్బన్, సూర్యాపేట (నేరవిభాగం), యాదాద్రి, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకం ఉమ్మడి జిల్లాలో అతివలకు ఉపయోగకరంగా ఉంది. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మహిళా వైద్యులతో పాటు సిబ్బంది కూడా మహిళలనే అందుబాటులో ఉంచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పీసీవోడీ, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, గర్భాశయం, హార్మోన్, మూత్రనాళం వంటి సమస్యలకు పరీక్షలు చేస్తున్నారు. మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలకు ఇక్కడి నుంచి రెఫర్ చేస్తున్నారు. చికిత్స వివరాలు ఆరోగ్య మహిళా యాప్లో నమోదు చేస్తున్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన మామోగ్రామ్ యంత్రం
ఎక్కువగా ఇన్ఫెక్షన్లే..
జిల్లాలో మహిళా ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ల సమస్యలతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. ఆతర్వాత మామోగ్రామ్, థైరాయిడ్, వీఐఏ సమస్యలతో బాధపడే వారు ఉంటున్నారు. సూర్యాపేట జిల్లాలో రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడే వారే ఎక్కువ సంఖ్యలో కన్పిస్తున్నారు. వీరికి జిల్లా ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి చికిత్స అందేలా చూస్తున్నారు. ఇతర ఆసుపత్రుల కంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మహిళా వైద్యులు, సిబ్బంది ఉండడంతో వారి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. తీవ్రస్థాయిలో జబ్బులతో బాధపడే వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రులకు పంపించి చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక పరీక్షలు
నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో కొత్తగా మరికొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8 నుంచి ఈ పరీక్షలను ప్రారంభించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 44 పరీక్షలతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా విటమిన్ డీ-3, బీ-12 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గుండె వ్యాధిగ్రస్తులకు 2డీ ఎకో, ఎక్స్రే, ఈసీజీ, మామోగ్రామ్ పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
చెప్పుకునేలా ఉంది
శ్రీదేవి, మాన్యంచెల్క, నల్గొండ
ఆరోగ్య మహిళా ఆసుపత్రి ద్వారా మహిళలకు ఎక్కువ శాతం మేలు జరుగుతుంది. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే అన్నిరకాల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు వైద్యులకు, సిబ్బందికి చెప్పుకునే అవకాశం ఉంది. అన్ని రకాల పరీక్షలు చేసి మాత్రలు అందిస్తున్నారు. మరికొంత మంది మహిళా సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
మెరుగుపరుస్తున్నాం
డా.అన్నిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్వో, నల్గొండ
ఆరోగ్య మహిళా ఆసుపత్రుల్లో ఓపీ క్రమేణా పెరుగుతోంది. ప్రతి మంగళవారం ఇక్కడ మహిళా వైద్యులతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. బాధితులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నాం. పరీక్షల కోసం వచ్చేవారి నుంచి రక్త పూతలు సేకరించి టీ హబ్ ద్వారా అన్ని రకాల పరీక్షలు చేయించి అదే రోజు వారి చరవాణికి సమాచారం అందేలా చూస్తున్నాం. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు రోగులను పంపిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు