ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
వచ్చే నెల రెండో వారంలో కేంద్రాలు ప్రారంభం
పెన్పహాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)
సూర్యాపేట పట్టణం, ఆత్మకూర్(ఎస్), న్యూస్టుడే: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభం కానుండటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కొనుగోళ్లకు సిద్ధం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2060, కామన్ రకం ధాన్యానికి రూ.2040 చెల్లించనున్నారు. తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అధికారులు కోరుతున్నారు. రైతులకు ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కంట్రోల్ రూంలో ఫిర్యాదులు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
276 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా జిల్లాలో 23 మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ, సహకార కేంద్రాలు 276 ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పీఏసీఎస్ సీఈవోలకు అవగాహన కల్పించారు. ఎలాంటి అక్రమాలకు, రైతులకు ఇబ్బందులకు తావులేకుండా, కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వేసవి కావడంతో నిరంతరం తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు.
గోనె సంచుల కొరత తలెత్తకుండా..
ఐకేపీ, సహకార కేంద్రాల్లో గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆ సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తేమశాతం నిర్ధారించే పరికరాలు, తూకం వేసే యంత్రాలు, ధాన్యం శుభ్రం చేసే ప్యాడీ క్లీనర్లు కొనుగోళ్లకు సరిపడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గోనె సంచుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసేందుకు లారీలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. రైతుల వివరాలు, ట్రక్ షీట్లో వివరాల నమోదు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు.
చెల్లింపుల్లో ‘పేట’కు రెండోస్థానం
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమలో జాప్యం లేకుండా అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలంలో రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా నగదు చెల్లింపుల్లో రెండో స్థానంలో నిలిచింది. యాసంగిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ