తెరపడే నాటకరంగానికి జీవం
తెలుగు నాటక రంగం తెరమరుగైపోతోంది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
ప్రణయ్రాజ్ వంగరి బృందం ప్రదర్శించిన ఆధునిక నాటకంలో ఓ సన్నివేశం
మోత్కూరు, న్యూస్టుడే: తెలుగు నాటక రంగం తెరమరుగైపోతోంది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. నాటక సమాజాలను ఆదరించే వారు లేక, ఆర్థిక వనరులు లేక మూతపడిపోతున్నాయి. దివిటీలు పెట్టి నాటకాలు ఆడిన రోజులు గతం. ప్రజల వినోదం కోసం కాకుండా అప్పటి ఉద్యమాలను ప్రచారం చేసి, జనాలను ఉత్తేజపరిచే లక్ష్యంతో నాటకాలు ప్రదర్శించేవారు. బుర్రకథ, హరికథ, జముకులకథ, భజన, కోలాటం, సుద్దులు, యక్షగానాలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు ఇలా ఎన్నో తెలుగు నాటక రంగంలో కీలక భూమిక పోషించాయి. నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
ఆ నాటకాలేవి?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1984 వరకు ఔత్సాహిక నటక రంగానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. ఎన్నో సంస్థలు ఈ రంగానికి సేవ చేశాయి. సూర్యాపేటలో పబ్లిక్ క్లబ్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోటీలకు దేశం నలుమూలల నుంచి పలు సంస్థలు పాల్గొన్నాయి. తెలంగాణలో హైదారాబాద్ మినహా ఔత్సాహిక నాటక రంగానికి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపింది నల్గొండ జిల్లాయే. నాడు గ్రామాల్లో నాట్య కళామండలి పేర్లతో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి డ్రెస్సులు, సామగ్రి తెప్పించుకునేవారు. కురుక్షేత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీసీతారామకల్యాణం, శ్రీకృష్ణరాయభారం, లవకుశ, సత్యహరిశ్చంద్ర లాంటి ఇతిహాసాలను ప్రజల కళ్లకద్దేవారు. నేడు ఆ కళాకారులు, వీధి భాగవతాలు, దాసరి, చిందు, యాక్షగాన కళాకారులు ఎక్కడో ఒకచోట ప్రదర్శించినా... ఆదరించేవారు కరవై దాన్ని వదులుకొని ఇతర వృత్తులపై జీవిస్తున్నారు.
జీవం పోస్తున్న సమాజాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలుగు నాటకరంగానికి జీవం పోస్తున్న సమాజాలు కొన్ని ఉన్నాయి. మిర్యాలగూడలో 14 సమాజాలన్నీ కలిసి ‘మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం’గా ఏర్పడి 1994 నుంచి తెలుగు సాంఘిక, పద్య నాటకాలను రాష్ట్రం నలుమూలాల ప్రదర్శిస్తున్నాయి. ఇందులో సుమారు 500 మంది కళాకారులున్నారు. నల్గొండలో కోమలి కళాసమితి కళాకారులు తెలుగు నాటకాన్ని ప్రజలు మరిచిపోకుండా రక్షిస్తున్నారు. నల్గొండలో ‘జేపీ ఆర్ట్స్ థియేటర్స్’, రసరమ్య తదితర సంస్థలూ అప్పుడప్పుడు తెలుగు నాటకాలను ప్రదర్శించి నాటకాభిమానులను అలరిస్తున్నాయి.
మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలి
ప్రణయ్రాజ్ వంగరి, నటుడు, నాటకరంగ పరిశోధకుడు, మోత్కూరు
పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, మండల స్థాయిలో నాటక కార్యశాలలు ఏర్పాటు చేసి, శిక్షణతోపాటు ప్రదర్శనలు ఇప్పించాలి. సర్వశిక్ష అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో రంగస్థల విద్యను ప్రవేశపెట్టి వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆ విద్యను చదివిన వారికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలి.
విద్యార్థులను నృత్యాలకు పరిమితం చేయొద్దు
అభినయ శ్రీనివాస్, సినీగీత, నాటక రచయిత మోత్కూరు
సినిమా, టీవీ ప్రభావం ఎంతగా ఉన్నప్పటికీ నాటక ప్రదర్శనలు చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. తమ సంస్థ అభినయ కళాసమితి ఆధ్వర్యంలో ఏటా సాంస్కృతికోత్సవాలు, నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులను నృత్యాలకే పరిమితం చేస్తున్నారు. వారితో నాటికలు వేయించాలి. నాటక పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి.
గ్రామీణ కళాకారులను ప్రోత్సహించాలి
గుంటి పిచ్చయ్య, నటుడు, దర్శకుడు, మఠంపల్లి
విద్యార్థి దశ నుంచి మొదలుకొని 40 ఏళ్లుగా ఈ రంగంలో కృషిచేస్తున్నాను. 1998లో యువభారతి సాహితీ, సాంస్కృతిక కళాసమితిని ఏర్పాటు చేసి నేటికీ పద్య, సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. సాంఘిక, పౌరాణిక, పద్య నాటకాలు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించి పురస్కారాలు, సన్మానాలు అందుకున్నా. తెలుగు నాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించాలి. గ్రామీణ కళాకారులు, సంస్థలను ప్రోత్సహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!