పుర పద్దుకు..పొద్దు పొడిచె
నల్గొండ మున్సిపాలిటీ 2023-24 వార్షిక బడ్జెట్ను రూ.784 కోట్లతో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఛైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్, భాజపా, ఎంఐఎం కౌన్సిలర్ల గైర్హాజరు
మాట్లాడుతున్న ఛైర్మన్ సైదిరెడ్డి, చిత్రంలో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, కమిషనర్ రమణాచారి
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే: నల్గొండ మున్సిపాలిటీ 2023-24 వార్షిక బడ్జెట్ను రూ.784 కోట్లతో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఛైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రవేశపెట్టారు. అభివృద్ధి పనులకు, పారిశుద్ధ్యానికి పెద్దపీˆట వేశారు. 10 శాతం గ్రీన్ బడ్జెట్కు పోగా, 8 శాతం నిధులు వేతనాలకు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఎస్డీఎఫ్, టీయుఎఫ్ఐడీసీˆ, అమృత్-2 నిధులను గ్రాంట్ల రూపంలో చూపించారు.
ప్రతిపక్షాల గైర్హాజరు
నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు ఉండగా,, బడ్జెట్ సమావేశానికి 21 మంది మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్- 18, భాజపా-6, ఎంఐఎం-1 చొప్పున కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉండగా.. అధికార భారాస నుంచి పిల్లి రామరాజు, జేరిపోతుల అశ్విని సమావేశానికి రాలేదు.
ఆమోదంపై అయోమయం!
నల్గొండ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ ఆమోదంపై అయోమయం నెలకొంది. బుధవారం పుర ఛైర్మన్ సైదిరెడ్డి బడ్జెట్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. కౌన్సిల్ సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని.. అందులో 17 మంది అంగీకారం లభిస్తే 2019 మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఆమోదం పొందినట్లే అని పుర కమిషనర్ రమణాచారి తెలిపారు. భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రం 2019 మున్సిపాలిటీ చట్టానికి గవర్నర్ ఆమోదం(అమైన్మెంటు) లభించనప్పుడు అది ఎలా అమల్లోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అదనపు కలెక్టరు ఖుష్భూగుప్తా, వైస్ ఛైర్మన్ రమేష్గౌడ్ పాల్గొన్నారు.కౌన్సిల్ను నిర్వీర్యం చేస్తున్న యంత్రాంగం
నల్గొండ మున్సిపాలిటీ యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు కౌన్సిల్ను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే తాము బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించామని కాంగ్రెస్ కౌన్సిలర్ వేణు అన్నారు. మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి నివాసంలో 18 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రూ.వందల కోట్లలో నిధులు బడ్జెట్లో చూపిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పనులకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురాకుండా పూర్తిగా విఫలం అయ్యారన్నారు.
నిధుల కేటాయింపులో వివక్ష
నీలగిరి: అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించామని భాజపా పురపాలిక ప్లోర్ లీడర్ బండారు ప్రసాద్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వార్డులలో సమస్యలు పెరుగుతున్నా నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకుని ప్రభుత్వ భూములలో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.భాజపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా