ఒక్కో కుటుంబంలో.. ఒకటికి మించి..!
ఈ రోజుల్లో.. ఏదో ఒక్క వాహనం లేని ఇల్లు కనిపించదు. రోజురోజుకు వాహనాల అవసరం, వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పేదవాడి వాహనం అనగానే సైకిల్ గుర్తుచ్చేది.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వాహనాల విక్రయాలు, వినియోగం
-కోదాడ న్యూస్టుడే
ఈ రోజుల్లో.. ఏదో ఒక్క వాహనం లేని ఇల్లు కనిపించదు. రోజురోజుకు వాహనాల అవసరం, వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పేదవాడి వాహనం అనగానే సైకిల్ గుర్తుచ్చేది. ఇప్పుడు ద్విచక్ర వాహనమే గుర్తుస్తోంది. ఈ నేపథ్యంలో.. కుటుంబాల కంటే వాహనాలే ఎక్కువగా ఉండడం విశేషం.
గత పదేళ్ల కాలంలో జిల్లాలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 లక్షల కుటుంబాలు ఉండగా, సుమారు 12 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 70 శాతం అనగా 8 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, కార్లు ఉన్నాయి. కారు, ట్రాక్టర్, ఇతర వాహనాలు ఉన్న ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరిగా ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారు సొంతంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు.
నల్గొండలో ఎక్కువ.. మిగతా చోట్ల తక్కువ
ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిలాల్లో సుమారు 5 లక్షల కుటుంబాలు ఉండగా.. 6 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు ఉన్నాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే వాహనాల సంఖ్య తక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కుటుంబాల కంటే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో యాదాద్రి జిల్లాలో ప్రజలు వాహనాలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువే..
జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 లోపే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ వాహనాలపై విధించే పన్నులపై రాయితీలు ఇస్తున్నా.. మార్కెట్లో ఎక్కువగా ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదు.
రవాణా శాఖ ఖజానాకు భారీగా ఆదాయం
2014లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ద్వారా రూ.50 కోట్ల ఆదాయం దాటకపోయేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సుమారు రూ.300 కోట్ల ఆదాయం ఆ శాఖ నుంచే వస్తుంది. వాహనాల క్రయవిక్రయాలు పెరగడంతో పాటు, రిజిస్ట్రేషన్ ధరలు కూడా ప్రభుత్వం పెంచడంతో ఆదాయం దండిగా వస్తుంది. రవాణాశాఖ లైఫ్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్, యూజర్ ట్యాక్స్ల ద్వారా పన్నులు వసూలు చేస్తోంది. వీటిలో లైఫ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది.
విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి
- వెంకట్రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి. సూర్యాపేట
గత కొన్నేళ్ల నుంచి వాహనాలు విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక వాహనం తప్పనిసరిగా ఉంది. రాబోయే రోజుల్లో కార్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!