అదిగదిగో.. రెండో భద్రాద్రి
రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరొందిన నూతనకల్ మండలం మిర్యాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది.
మిర్యాలలో శ్రీరామ నవమి
ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం
మిర్యాలలో రామాయణం, మహాభారతం ఘట్టాలను తెలియజేసే 80 అడుగుల గాలిగోపురం
నూతనకల్ గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరొందిన నూతనకల్ మండలం మిర్యాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. పలక రామచంద్రుడు, సంతాన రాముడిగా పేరొందిన స్వామివారి కల్యాణోత్సవాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు. వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.
చరిత్ర.. ప్రత్యేకతలు
శ్రీఖర మహర్షి శ్రీరాముడి కోసం పలకపై రామకోటి రాస్తూ తపస్సు చేయగా పలకపై స్వామివారు ప్రత్యక్షమయ్యాడని, అప్పటి నుంచి పలక రామచంద్రుడిగా పేరొందారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయంలో పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తారు. అయోధ్య నుంచి అరణ్యవాసం కోసం వెళ్తున్న సీతాసమేత రామలక్ష్మణులు ఆలయ ప్రాంతంలో సేదదీరడంతో కాకతీయుల కాలంలో ఆలయం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. మహాభారతం, రామాయణం ఇతిహాసాలను తెలియజేసే శిల్పాలతో కూడిన 80 అడుగుల గాలిగోపురం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రావణుడిని సంహరించేందుకు ఆంజనేయుడు తన భుజాలపై రామలక్ష్మణులను మోసుకెళ్తూ సముద్రాన్ని దాటే శిల్పం ఆకట్టుకుంటుంది. కౌరవులు, పాండవుల యుద్ధ సన్నివేశాలు, శ్రీమహావిష్ణువు, గరుత్మంతుడి విశ్వరూపం శిల్పాలు కనువిందు చేస్తాయి.
* గతంలో శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో కల్యాణం జరుగుతున్న సమయంలో ఈ ఆలయంలో అక్షింతలు పచ్చగా మారేవని స్థానికులు చెబుతున్నారు. తలంబ్రాలను మిర్యాల గ్రామస్థులు తమ ఇళ్లలోని ధాన్యగారాలు, దేవుడి పూజ గదిలో ఉంచుకొంటారు. పెళ్లి కాని యువతులు, యువకులు స్వామివారి కల్యాణోత్సవాల్లో పాల్గొని సేవలు చేస్తే ఏడాదిలోగా వివాహాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. గరుడ ముద్ద తిన్న దంపతులకు సంతానం కల్గుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉండటంతో స్వామివారిని సంతాన రాముడిగా కొలుస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
-కనకటి పల్ల వెంకన్న, ఆలయ ఛైర్మన్, మిర్యాల
శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, చిన్నారులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అన్నదాన కార్యక్రమాలు చేపడుతాం. సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించనున్నాం.
ఉత్సవాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలు
ఈ నెల 30న: శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణం
31న: గరుడ సేవ, ధ్వజస్తంభ ఆహ్వానం, గరుడ ముద్ద సమర్పణ
ఏప్రిల్ 1న: రథోత్సవం
2న: ఎడ్లబండ్లతో రైతుల ప్రదక్షిణ
3న: పొన్నసేవ
4న: దోపోత్సవం
5న: నగర సంకీర్తన
6న: ఉత్సవ విగ్రహాల యథాస్థాన పూజలు
7న: పునఃప్రతిష్ఠ, ఆలయ ప్రవేశం
8న: ముగింపు ఉత్సవాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు