ఎనిమిది నెలల తర్వాత మృతదేహం లభ్యం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారి ఇచ్చి భర్తను హతమార్చిన సంఘటన గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
వైజాగ్కాలనీ సమీపంలో కృష్ణా వెనుక జలాలలో లభ్యమైన రాగ్య మృతదేహం
నేరేడుగొమ్ము(చందంపేట), న్యూస్టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారి ఇచ్చి భర్తను హతమార్చిన సంఘటన గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన ధనావత్ రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావికి చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వగ్రామంలో ఉపాధిలేక హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో రాగ్య భార్య, తన అక్క భర్త అయిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సపావట్ లక్పతికి దగ్గరైంది. తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో రాగ్యను హతమార్చాలని నిర్ణయించుకొని నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన ముగ్గురు వ్యక్తులతో రూ.20 లక్షలకు సుపారి కుదుర్చుకుంది. పథకం ప్రకారం.. గత ఏడాది ఆగస్టు 19న రాగ్యను మచ్చిక చేసుకున్న సుపారి సభ్యులు హైదరాబాద్ నగర శివారుకు తీసుకువెళ్లి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. అక్కడి నుంచి నేరేడుగొమ్ము మండలం వైజాగ్కాలనీ సమీపంలోని కృష్ణా వెనుకజలాల్లో చేపలు పట్టే వలలో చుట్టి దానికి ఒకరాయిని కట్టి పడవలో కొద్ది దూరం తీసుకువెళ్లి పడవేశారని విచారణలో నిందితులు అంగీకరించినట్లు రాయదుర్గం ఎస్సై సతీష్ అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో ఎనిమిదినెలల తర్వాత ధనావత్ రాగ్యనాయక్ అవశేషాలు గురువారం వైజాగ్కాలనీ సమీపంలోని కృష్ణా వెనుకజలాల్లో లభ్యమయ్యాయి. అక్కడి జాలరులు నేరేడుగొమ్ము ఎస్సై రాజుకు సమాచారం అందించారు. సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వలలో చుట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు