సీసం గోళీలు.. ఏడురాళ్ల ఆటలు
వేసవి సెలవులొస్తే వీధుల్లో ఎక్కడ చూసినా మేమే కనిపించేవాళ్లం. స్నేహితులతో కలిసి సీసం గోళీలు, బంతులతో ఏడురాళ్ల ఆటలు ఆడేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు బంధువుల పిల్లలతో కలిసి కొండలు ఎక్కి సరదాగా గడిపేవాళ్లం
బండారు రాజశేఖర్, డీఎస్పీ, ఏపీ సీఐడీ
న్యూస్టుడే, మఠంపల్లి
వేసవి సెలవుల్లో..
వేసవి సెలవులొస్తే వీధుల్లో ఎక్కడ చూసినా మేమే కనిపించేవాళ్లం. స్నేహితులతో కలిసి సీసం గోళీలు, బంతులతో ఏడురాళ్ల ఆటలు ఆడేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు బంధువుల పిల్లలతో కలిసి కొండలు ఎక్కి సరదాగా గడిపేవాళ్లం. అడవుల్లో తిరుగుతూ అక్కడ దొరికే రకరకాల పండ్లను తినేవాళ్లం. మా కుటుంబం మఠంపల్లిలో స్థిరపడటం వల్ల ఇక్కడి వీవీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను. వార్షిక పరీక్షలు రాశాక ఆడుకునేందుకు స్వేచ్ఛ లభించేది. అప్పటి మిత్రులతో ఎన్నెస్పీ ఖాళీ ప్రదేశంలో, మా పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం, సాయంత్రం బ్యాడ్మింటన్, వాలీబాల్, మధ్యాహ్నం స్నేహితుల ఇళ్లల్లో చెస్ ఆడేవాళ్లం. అమ్మతో అమ్మమ్మ వాళ్ల ఊరు ఏపీలోని కారంపూడి వెళ్లి బంధువుల పిల్లలతో పరుగు పందేలు, సైకిల్ పోటీల్లో పాల్గొనేవాడిని. అథ్లెటిక్స్తో పాటు క్రీడల్లో ఎప్పుడూ ముందుండేవాడిని. ఈ పోటీతత్వమే చదువుల్లో, ఉద్యోగ సాధనలో లక్ష్యం దిశగా నన్ను నడిపించింది. వేసవి సెలవులను ఇష్టమైన విధంగా ఉపయోగించుకొనేలా మా పిల్లలను ప్రోత్సహించేవాడిని. సెలవులు మానసిక వికాసానికి దోహదపడితే, స్నేహితులు సమాజాన్ని మనకు పరిచయం చేస్తారు.
వాహనం ఢీకొని నవవరుని దుర్మరణం
కొండమల్లేపల్లి, న్యూస్టుడే: అతనికి పెళ్లయి 20 రోజులే అయింది.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. సెలవు కావడంతో తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు.. ఇంటి వద్ద భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది.. మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరే సమయంలో.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మండలకేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనయ్య కుమారుడు వెంకటేష్(28) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించికొని తన ద్విచక్రవాహనంపై పెండ్లిపాకలకు వస్తుండగా.. స్థానిక హైదరాబాద్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన ఓ యువతితో ఇటీవలే వివాహమైంది. నవవరుడు మృతి చెందడంతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతుని తండ్రి శ్రీనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆటో బోల్తా.. యువకుడి మృతి
పెన్పహాడ్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన పెన్పహాడ్ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సింగారెడ్డిపాలెం ఆవాసం జానారెడ్డినగర్లో తుల్జాభవాని పండగ సందర్భంగా యాటపోతులు తెచ్చేందుకు ఆంగోతు అజయ్, భూక్యా గోపాల్, భూక్యా చాంప్లా, భూక్యా వరుణ్, ధారావత్ హుస్సేన్ ఆటోలో గూడెపుకుంట తండాకు వెళుతున్నారు. పెన్పహాడ్ శివారులోకి రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆంగోతు అజయ్ (18), భూక్యా వరుణ్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆంగోతు అజయ్ మృతిచెందారు. సంప్రదాయ పండగను సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో తమ కుమారుడు రోడ్డు ప్రమాదం బలి తీసుకుందని అజయ్ తల్లిదండ్రులు నాగు, నాగమ్మ గుండెలవిసేలా విలపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు అజయ్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం, తమ్ముడు విజయ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కూలీ పనులు చేసుకొని తమ కుమారులను చదివించుకుంటున్నారు. యువకుడి మృతితో జానారెడ్డినగర్లో తుల్జాభవాని పండగ రోజున విషాదఛాయలు అలుముకున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM