అటకెక్కిన ఆన్లైన్..!
పురపాలికల్లో దుకాణాల ఆన్లైన్ విధానం అటకెక్కింది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది
పురపాలికల్లో ట్రేడ్ లైసెన్స్ పన్ను వసూలుపై అశ్రద్ధ
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే
సూర్యాపేటలోని నల్లాలబావి రోడ్డులో దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు
పురపాలికల్లో దుకాణాల ఆన్లైన్ విధానం అటకెక్కింది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది. ఇన్నాళ్లూ అవసరమున్న దుకాణదారులు మాత్రమే అనుమతి పత్రం తీసుకొనేందుకు ముందుకొచ్చేవారు. లైసెన్సుల జారీలో నిర్లక్ష్యం, అరకొర ఆన్లైన్ విధానంతో ఆదాయ లక్ష్యం నీరుగారుతోంది.
ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో పురపాలిక ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో దాదాపు 29,876 దుకాణాలు ఉన్నాయి. వీటిలో 14,187 దుకాణాలను మాత్రమే అధికారులు ఆన్లైన్ చేశారు. ఏటా బల్దియాలకు రూ.కోట్ల ఆదాయం సమకూరాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో భారీగా గండిపడుతోంది.
పెరుగుతున్న దుకాణాలు..
ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల విస్తీర్ణంతో పాటు దుకాణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు రహదారులు, ప్రధాన కేంద్రాలకే పరిమితమైన వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఫలహారశాలలు కాలనీల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలికపై పడింది. ఈ భారాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మెకానిక్, వండ్రంగి, వెల్డింగ్, ఎంటర్ప్రైజెస్, రైస్మిల్లులు, పూల దుకాణాలు, తదితర వ్యాపార సంస్థల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. వాటిని గుర్తించి ఆన్లైన్ చేయడం ద్వారా పన్ను వసూలు చేసి పురపాలికకు ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులు అవసరమైన మేర చొరవ చూపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పురపాలికల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. పూర్తి స్థాయిలో దుకాణాలను ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.