అక్కాచెల్లెళ్లు..సంకల్పంలో విరిసిన మల్లెలు
ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రి మృతి చెందగా.. కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లి కూడా ఇటీవల మృతి చెందింది
పాలెం గ్రామంలో కావేరి, చింటు ఉంటున్న పూరిల్లు
గుర్రంపోడు, హాలియా, న్యూస్టుడే: ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రి మృతి చెందగా.. కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లి కూడా ఇటీవల మృతి చెందింది. తల్లడిల్లిన ఆ పసి హృదయాలు మొక్కవోని గుండె ధైర్యంతో భవిష్యత్తు కోసం చదువుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమకు దాతృత్వం కలిగిన వారు అందించే అరకొర సాయంతోనే చదువుకుని ఉన్నత స్థానంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. ఒకరికొకరు తోడుగా ఆ ఇద్దరు అక్కా చెల్ల్లెళ్లు సెలవు దినాలలో కూలి పనులు చేసుకుంటూ, మిగతా రోజుల్లో పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్న తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. అనుముల మండలం పాలెం గ్రామానికి చెందిన మంగమ్మకు గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి కలకొండ నాగయ్యతో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగయ్య లారీ డ్రైవర్గా పని చేసేవాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి కావేరికి నాలుగేళ్లు, చిన్నమ్మాయి చింటు ఏడాది వయస్సుండగా నాగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. బతుకుదెరువు కోసం ఇద్దరు పసి పిల్లలతో తల్లిగారింటికి వచ్చిన మంగమ్మ పరిస్థితి గమనించిన పాలెం గ్రామస్థులు ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నివాసం పూరి గుడిసె వేసుకోవడానికి సహకరించారు. కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడ పిల్లలు కావేరి, చింటులను చదివించింది. తొమ్మిది నెలల క్రితం మంగమ్మ అనారోగ్యంతో మృతి చెందటంతో ఆ ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు.. గంపెడు దుఃఖాన్ని దిగమింగి తల్లి కట్టిన పూరి గుడిసెలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కావేరి హాలియాలో ఒకేషనల్ ఇంటర్, చింటు చింతగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేశారు. పగటి వేళలో తమ ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో అమ్మమ్మ వద్ద తలదాచుకుంటున్నారు. వన్ ఛాలెంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పటాన్ చెరువు సీఐ వేణుగోపాల్రెడ్డి వారి పరిస్థితి తెలుసుకుని ఈ నెల 26న ఈ చిన్నారుల ఉన్నత చదువుల కోసం రూ.50 వేలు డీడీ రూపంలో ఆర్థిక సహకారం అందించారు. బాగా చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలన్న ఆ చిన్నారుల ఆకాంక్ష నేటి విద్యార్థులకు, యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!