మామిడి రైతుకు నష్టాల చేదు
మామిడి రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా కనీసం పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో మామిడి చెట్లను తొలగించాలనే యోచన చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.
ధర తగ్గడంతో పెట్టుబడులు రాని వైనం
తోటలను నరికివేస్తున్న కర్షకులు
భానుపురి, న్యూస్టుడే
పెన్పహాడ్: లింగాలలో ఓ రైతు నరికివేసిన మామిడి తోట
మామిడి రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా కనీసం పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో మామిడి చెట్లను తొలగించాలనే యోచన చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో 10,720 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో కురిసిన అకాల వర్షం.. వడగళ్లు, వీచిన బలమైన గాలులతో 30 శాతానికి పైగా కాయలను నేలరాలడంతో రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 1.05 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి ఉంటుంది. ఈ సారి 35 వేల మెట్రిక్ టన్నుల కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. సీజన్ ముగియనుండగా మరో మూడు, నాలుగు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ లెక్కలను చూస్తే కాపు తగ్గినట్లు తెలుస్తోంది.
వెంటాడిన చీడపీడల బెడద
ఈ సారి మామిడిపైనా చీడపీడల బెడత గణనీయంగా పెరిగింది. తేనెమంచు, బూడిద తెగులు, ఇతరత్రా పురుగులు, తెగుళ్లు తీవ్రంగా ఆశించడంతో కాయలపై మంగు మచ్చలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎగుమతి తగ్గిందంటూ దిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ధర అమాంతం తగ్గింది. జిల్లాలో అధికంగా సాగులో ఉన్న బంగినపల్లి రకానికి గతేడాది ఈ సమయానికి క్వింటాకు రూ.3000-4300 ధర ఉండగా ఈసారి రూ.1200-2800 మాత్రమే పలికింది. మంగు మచ్చలున్న కాయలను వేరుచేసి రూ.500-800 ధరకు కొనుగోలు చేస్తున్నారు.
120 ఎకరాల్లో తోటలు మాయం
జిల్లాలో దిగుబడి, ధర గణనీయంగా తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు దిగులు చెందుతున్నారు. మామిడికి వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయనందున ప్రకృతి విపత్తుల నష్టానికి ఆర్థిక ఆసరా దక్కలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 120 ఎకరాల్లో మామిడి తోటలను నరికివేసి ఇతర పంటల సాగుకు మళ్లుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పెన్పహాడ్ మండలం లింగాలలో 30, చీదెళ్లలో 10, కోదాడ మండలం గుడిబండలో 30, మునగాలలో 30, నూతనకల్ మండలం ఎర్రపహాడ్లో 20 ఎకరాల్లో మామిడి తోటలను రైతులు నరికివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగైదేళ్లలో 70 శాతం వరకు మామిడి తోటలు మాయమయ్యే ప్రమాదముంది.
ప్రతిపాదనలు పంపాం
రామారావు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట
జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం అందించే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే బాధితులకు పరిహారం అందజేస్తాం. మొదటి విడతలో సుమారు 1,400 ఎకరాల్లో మామిడి తోటలు నష్టపోయాయి.
ఆరుగాలం కష్టపడి సస్యరక్షణ చర్యలు తీసుకున్నా మామిడి తోటలకు కనీసం పెట్టుబడులు రావడం లేదు. మార్కెట్లో దళారులు ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు ధర రాక ఈసారి నష్టపోయిన పెన్పహాడ్ మండలానికి చెందిన పలువురు రైతులు 40 ఎకరాల్లో మామిడి తోటలను నరికివేశారు. ఇతర పంటలు సాగు చేసినా లాభాలు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం