సమస్యలపై ప్రశ్నించె.. పరిష్కారాలు చర్చించె
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చుతున్నామని జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు.
వాడీవేడిగా సాగిన యాదాద్రి జడ్పీ సమావేశం
సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూర్చుతున్నామని జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
* ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులపై సమావేశంలో వాడీవేడి చర్చ కొనసాగింది. కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేశాక రైతులకు తక్పట్టీలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, కో- ఆప్షన్ సభ్యుడు ఖలీల్ డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియ ముగిసినప్పటికీ రైతులను మిల్లుల వద్దకు పిలిచి కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించే లారీల డ్రైవర్లు రైతుల నుంచి ఒక్కో బస్తా పేరిట రూ.2 నుంచి రూ.4 వసూలు చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో ధాన్యం తరలించడం లేదని ఆరోపించారు. తూకం, తేమ, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడారు. ఈ సీజన్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మిల్లుల్లో స్థలం లేక ధాన్యం నిలువ చేసేందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతులకు ఇప్పటి వరకు రూ.142 కోట్లు చెల్లించామని, మరో రూ.110 కోట్లు కావాలని ప్రభుత్వానికి కోరామని కలెక్టర్ అన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని పౌరసరఫరాల సంస్థ డీఎం గోపికృష్ణ అన్నారు.
* గ్రామ పంచాయతీల్లో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు డబ్బులు చెల్లించాలని విద్యుత్ అధికారుల చెబుతున్నారని సభ్యుడు ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆలేరులోనే డిగ్రీ చదివే విద్యార్థులు 2000కు పైగా ఉంటారని, వారిలో పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అనాథలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని సభ్యుడు వెంకట్రెడ్డి కోరారు. ప్రభుత్వ విద్యాలయాలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వాలని ఎంపీపీ నరాల నిర్మల, సభ్యురాలు అనూరాధ కోరారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్రావు, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్రెడ్డి నగేష్, జ్యోతి, శారద, వీరమల్ల భాను, అనూరాధ, శ్రీశైలం పాల్గొన్నారు.
గైర్హాజరు...
అత్యధిక ప్రజాప్రతినిధులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. దీంతో సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సమావేశానికి హాజరు కావాలని అధికారులు ప్రత్యేకంగా మంత్రి జగదీష్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిషోర్లకు ఆహ్వానం పంపినప్పటికి ఎవరూ హాజరు కాలేదు. అన్ని మండలాల ఎమ్పీపీలకు, జడ్పీటీసీలకు అధికారులు కబురు పెట్టినప్పటికీ అత్యధిక ఎంపీపీలు, కొందరు జడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. సమావేశానికి పలువురు జిల్లా అధికారులు గైర్హాజరై తమ కింది ఉద్యోగులను సమావేశానికి పంపించారు.
సమావేశానికి హాజరైన సభ్యులు, అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..