ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జూనియర్ బాల, బాలికలకు మఠంపల్లి మాంట్ఫోర్ట్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు గురువారం ముగిశాయి.
విజేతలుగా నల్గొండ బాలుర, సూర్యాపేట బాలికల జట్లు
మఠంపల్లి: రాష్ట్రస్థాయి రగ్బీ బాలికల జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన సూర్యాపేట జట్టుతో నిర్వాహకులు
మఠంపల్లి, న్యూస్టుడే: రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జూనియర్ బాల, బాలికలకు మఠంపల్లి మాంట్ఫోర్ట్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు గురువారం ముగిశాయి. 15 జిల్లాలకు చెందిన 15 బాలికల జట్లు, ఆరు బాలుర జట్లు పాల్గొన్న ఈ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. ‘లీగ్ కం నాకౌట్’ పద్ధతిలో జరిగిన తుది పోటీల్లో బాలుర విభాగంలో నల్గొండ, బాలికల విభాగంలో సూర్యాపేట జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో మేడ్చల్కు ద్వితీయ, సూర్యాపేట, నిజామాబాద్కు తృతీయ స్థానాలు, బాలికల విభాగంలో నల్గొండ, హైదరాబాదు జట్లు ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈనెల 4, 5, 6తేదీల్లో పుణెలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు తెలంగాణ తరఫున ఎంపికైన బాల, బాలికల పేర్లనూ నిర్వాహకులు ప్రకటించారు. బాలుర జట్టుకు నల్గొండకు చెందిన మధు, సాయి, శ్రీకాంత్, మేడ్చల్కు చెందిన వాసు, అశోక్, రాఘవేంద్ర(సూర్యాపేట), గోపాల్ (నిజామాబాద్), అనిల్(మెదక్), గణేష్(ఖమ్మం), విఘ్నేష్(వరంగల్), ప్రణయ్(సిద్ధిపేట), వెంకటేష్(మహబూబాబాద్), బాలికల జట్టుకు మహేశ్వరి, శ్రీవిద్య, శిరీష, రాజశ్రీ(సూర్యాపేట), అరుణ, దివ్య, అఖిల(నల్గొండ), సోనీ, చందన(హైదరాబాద్) స్పందన(వరంగల్), చందన(ఖమ్మం), లహరిక(మేడ్చల్) ఎంపికయ్యారని టోర్నమెంట్ నిర్వాహక కమిటీ కార్యదర్శి కె.తురుణ్రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ఎంపిక కమిటీ ఛైర్మన్ కె.గణేష్ రవికుమార్ తెలిపారు. జిల్లా ఛైర్మన్, సర్పంచి ఎం.శ్రీనివాసరెడ్డి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం