రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వీహెచ్
ట్రిఫుల్ ఆర్ బాధిత రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు.
సబ్జైలు ముందు బైఠాయించిన హనుమంతరావు
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: ట్రిఫుల్ ఆర్ బాధిత రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. భువనగిరి సబ్జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆర్ఆర్ఆర్ బాధిత రైతులను గురువారం వీహెచ్ పరామర్శించారు. ప్రాంతీయ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్చాలని మంగళవారం కలెక్టరేట్ వద్ద మంత్రి జగదీశ్రెడ్డి కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నలుగురు రైతులు పల్లెర్ల యాదగిరి, గడ్డమీది మల్లేషం, అవిశెట్టి నిఖిల్, మల్లబోయిన బాలులను భువనగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వీరిని ములాఖత్ ద్వారా కలిసేందుకు వీహెచ్ జైలు అధికారుల అనుమతి కోరారు. అనుమతి రాకపోవడంతో ఆయన కొద్దిసేపు జైలు ద్వారం ముందు బైఠాయించారు. పట్టణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అక్కడకు చేరుకొని వీహెచ్తో మాట్లాడారు. రోడ్డు నిర్మాణం కోసం మొదట్లో ప్రతిపాదించిన అలైన్మెంట్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అనంతరం రైతులతో వీహెచ్ మాట్లాడారు. భువనగిరి కేంద్రంగా మరో నయీం తయారయ్యాడని అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఈ విషయమై సబ్జైలు అధికారి పూర్ణచందర్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ జైలు నిబంధనల మేరకు ములాఖత్ కలిసే ప్రక్రియలో 15-20 నిమిషాల సమయం పడుతుందని, ఆ తనిఖీలో భాగంగానే ఆలస్యం జరిగిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!