logo

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Published : 02 Jun 2023 04:48 IST

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై సైదబాబు తెలిపిన వివరాలు... రాజమహేంద్రవరం మండలం నామవరం గ్రామానికి చెందిన అకళ్ల లక్ష్మీకల్యాణి(48) కొంత కాలంగా హైదరాబాద్‌లో వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి టాటా ఏస్‌ వాహనంలో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె క్యాబిన్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


బీర్ల అమ్మకాల్లో నల్గొండకు ప్రథమ స్థానం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: బీర్ల అమ్మకాల్లో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మే 1 నుంచి 31 వరకు జరిగిన బీర్ల అమ్మకాలు అత్యధికంగా జిల్లాలో జరిగినట్లు రాష్ట్ర అధికారులు గుర్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 5,23,333 పెట్టెల బీర్లు అమ్మకాలు జరిగాయి. తద్వారా రూ.67.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. మద్యం సీసాల ధరలు(ఫుల్‌బాటిల్‌) రూ.40 నుంచి రూ.60 తగ్గించినా అమ్మకాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు