logo

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలక పాత్ర

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు భవనాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగుర వేసి జాతీయ గీతాలాపన చేశారు.

Published : 03 Jun 2023 05:04 IST

జిల్లా కోర్టు భవనాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేసి గీతాలాపన చేస్తున్న జిల్లా జడ్జి నాగరాజు, చిత్రంలో బార్‌ అధ్యక్షుడు నేతి రఘుపతి

నల్గొండ లీగల్‌:  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు భవనాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగుర వేసి జాతీయ గీతాలాపన చేశారు. జిల్లా జడ్జిలు తిరుపతి, సంపూర్ణ అనంద్‌, సబ్‌జడ్జిలు కార్తీక్‌, దీప్తి, మేజిస్ట్రేట్‌లు శ్రీవాణి, శిరీష, సౌందర్య, రఘుపతి, జనిగల రవికుమార్‌, సీనియర్‌ జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.   తెలంగాణ ఆవిర్భావంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారని జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది. జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నేతి రఘుపతి అధ్యక్షతన కేకు కోసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని