రాచకొండకు పూర్వ వైభవం వచ్చేనా?
హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాచకొండ.. 14వ శతాబ్దంలో 115 ఏళ్లపాటు రాజధానిగా కొనసాగినందున ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా మారే బదులు ‘అనాథ’లా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి ఎనిమిదేళ్లయినా కలగని మోక్షం
రాచకొండ ముఖద్వారం
చౌటుప్పల్, న్యూస్టుడే: హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాచకొండ.. 14వ శతాబ్దంలో 115 ఏళ్లపాటు రాజధానిగా కొనసాగినందున ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా మారే బదులు ‘అనాథ’లా మారింది. ఎందరో వీరులకు, కవులు, కళాకారులకు నిలయమై జనరంజకంగా పాలన సాగిన రేచర్ల ‘పద్మనాయక పాలన బహుమనీ సుల్తానుల దండయాత్రతో 1475లో అంతమైందని, బహుమనీల గవర్నర్గా నియమితుడైన శితాబ్ఖాన్ సైతం రాచకొండను కేంద్రంగా చేసుకుని పాలించాడని చరిత్రకారుల మాట. ఇంతగొప్ప రాచరిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వమున్న రాచకొండను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి సంవత్సరంలోనే 2014 డిసెంబరులో సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆనాటి చారిత్రక కట్టడాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వేలో ఆయన వీక్షించారు. సుమారు పది వేల ఎకరాల్లో విస్తరించిన ఒకనాటి తెలుగు రాజులు పాలించిన రాచకొండకు కేసీఆర్ పూర్వ వైభవం తెస్తారని ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు.
శత్రు దుర్భేద్యంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ చైనా గోడను తలపించే విధంగా గుట్టలను కలుపుతూ భారీ రాళ్లతో నిర్మించిన ప్రాకారాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆరొందల అడుగుల ఎత్తయిన కచేరీ కొండపై నిర్మించిన రాజస్థానాన్ని చేరాలంటే ఏడు ద్వారాలను, వాటికి పహారా ఉండే సైనికులను దాటుకుని వెళ్లేలా నిర్మించిన రక్షణ వ్యవస్థ అబ్బుర పరుస్తుంది. కొండపైకి వెళ్లేందుకు రాతితోనే నిర్మించిన మెట్లు ఇప్పటికీ ఆనవాళ్లుగా మిగిలాయి. పద్మనాయకులు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారని, పంటలకు నీటి వనరుల కోసం ఆనాడు తవ్వించిన చెరువులు అనపోత సముద్రం, రాయ సముద్రం, నాగసముద్రం నేటికీ జలాలతో నిండుగా ఉండడం విశేషం. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సీమలుగా విభజించి దుర్గాధిపతులను నియమించారు. దేవరకొండ దుర్గాన్ని, దేవాలయాలను నిర్మించారు. పద్మనాయకుల పాలనలో వస్త్రాల తయారీ, కలంకారీ, అద్దకపు పరిశ్రమ కూడా ఉండేది. ఇంత గొప్ప చారిత్రక వారసత్వాన్ని రక్షించే ప్రయత్నాలు ఇక్కడ జరగడం లేదు.
కవులు, కళాకారులకు నిలయం
రాచకొండ రాజ్యంలో సంస్కృత భాషకు ఆదరణ ఉండేది. పద్మనాయకుల ఆస్థానంలో కొలువుదీరిన తెలుగు కవుల్లో గౌరన, పోతన ప్రసిద్ధులు. పోతనామాత్యులు రాజు కోరికపై భోగినీ దండకం రచించారు. పరమేశ్వరార్పణగా మహాభాగవత రచన ప్రారంభించారు. ఆ కావ్యాన్ని రాజుకు అంకితమివ్వడానికి నిరాకరించారు. రాజాస్థానాన్ని ఆశ్రయించి జీవించుట హేయమని భావించి జన్మస్థలం బమ్మెర చేరి హాలిక వృత్తిలో జీవించారు. మహాకవి శ్రీనాధుడు రాచకొండను సందర్శించి సన్మానం పొందారు. ఇక్కడ కవులకు, కళాకారులకు గౌరవముండేది. రాచకొండ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే గోలకొండ, భువనగిరి, ఓరుగల్లు, పోతన జన్మస్థలం బమ్మెర తదితర ప్రదేశాలను చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించి ప్రభుత్వం పర్యటక కేంద్రాలుగా అభివృద్ధి పరుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశమ వార్షికోత్సవాల సందర్భంగానైనా రాచకొండ ప్రాభవాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్