రగ్బీలో రాణిస్తూ..విజయాలు సాధిస్తూ..!
రగ్బీ క్రీడపై వివిధ జిల్లాల్లో రగ్బీ అసోసియేషన్ చేపడుతున్న అవగాహన శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
మఠంపల్లిలో రగ్బీ ఆడుతున్న క్రీడాకారులు
మఠంపల్లి, న్యూస్టుడే: రగ్బీ క్రీడపై వివిధ జిల్లాల్లో రగ్బీ అసోసియేషన్ చేపడుతున్న అవగాహన శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా అసోసియేషన్ల ఆధ్వర్యంలో గత సంవత్సరం పాఠశాలల్లో విద్యార్థులకు బంతులను పంపిణీ చేసి స్థానిక క్రీడాకారులతో రగ్బీపై ఆసక్తి కలిగిస్తూ నిత్యం సాధన చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటలకు విశాల క్రీడా మైదానాలు ఉన్న మఠంపల్లిలో ఇప్పటికే పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. తాజాగా మండల కేంద్రంలోని మాంట్ఫోర్ట్ పాఠశాల మైదానంలో జరిగిన జూనియర్ బాల, బాలికల పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు, 15 మంది కోచ్లు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సైతం ఇక్కడే పూర్తి చేశారు. రగ్బీ ఆటపై యువ క్రీడాకారుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘న్యూస్టుడే’.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా:
మూడేళ్లుగా రగ్బీ ఆడుతున్నాను. గతంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నాను. ఇప్పటివరకు రెండు సార్లు జిల్లా, ఓ సారి రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. ప్రస్తుతం జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈ నెలలోనే పుణెలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జూనియర్ బాలుర జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాను.
రాఘవేంద్ర, సూర్యాపేట జిల్లా
పాఠశాల నుంచే అవగాహన:
పాఠశాల నుంచే రగ్బీపై అవగాహన ఉంది. కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నాను. జిల్లా స్థాయిలో పలుమార్లు, రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు పాల్గొన్నాను. ఇక్కడ జాతీయ స్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉన్న కొద్ది రోజులు సాధన చేసి జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాను.
శ్రీవిద్య, సూర్యాపేట జిల్లా
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో:
జిల్లా కేంద్రంలో జరిగిన శిక్షణ కేంద్రానికి హాజరై రగ్బీలో మెలకువలు నేర్చుకున్నాను. జూనియర్ బాలికల విభాగంలో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కడ పోటీలు జరిగినా తప్పక వెళుతుంటాను.
అఖిల, నల్గొండ జిల్లా
శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం:
2017నుంచి రగ్బీపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర అసోసియేషన్, సర్పంచి తదితరుల సహకారంతో మఠంపల్లిలో రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాం. ఇప్పటివరకు 40కి పైగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి బంతులు అందజేశాం. రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీపై ఆసక్తి పెరుగుతోంది. జాతీయ స్థాయికి ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
కె.తరుణ్రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.