6న దండుమల్కాపురానికి మంత్రి కేటీఆర్ రాక!
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న రానున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆ రోజు పారిశ్రామిక వాడలో సంబరాలు జరిపే కార్యక్రమం ఉంది.
పారిశ్రామిక పార్కులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కామన్ ఫెసిలిటీ సెంటర్ భవనం ఇదే..
చౌటుప్పల్గ్రామీణం, న్యూస్టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న రానున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆ రోజు పారిశ్రామిక వాడలో సంబరాలు జరిపే కార్యక్రమం ఉంది. దీంతో పాటు దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో రూ.40 కోట్లతో నిర్మించిన కామన్ఫెసిలిటీ సెంటర్ భవనాలను, ఆడిటోరియం, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఐలా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే పారిశ్రామిక పార్కులో 60 పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఆ ఉత్పత్తుల ప్రదర్శనశాలను కేటీఆర్ పరిశీలిస్తారు. పారిశ్రామిక పార్కులో పరిశ్రమల ఉత్పత్తుల తర్వాత వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. నూతనంగా పారిశ్రామిక పార్కు పక్కనే సర్వే నంబరు 617లో 106 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే బొమ్మల పార్కు క్లస్టర్కు శంకుస్థాపన చేస్తారు. ఉదయం పది గంటలకు మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం కేటీఆర్ పర్యటన అధికారికంగా ఖరారు కానుందని తెలంగాణ పరిశ్రమల సమాఖ్య(టీఫ్) అధ్యక్షుడు కె.సుధీర్రెడ్డి, కార్యదర్శి గోపాల్రావు, టాయ్స్ క్లస్టర్ డైరెక్టర్ శ్రీహరిరెడ్డి ‘న్యూస్టుడే’తో తెలిపారు. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) అధికారులు కూడా మంత్రి కేటీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నారు.
పారిశ్రామిక వాడల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు... తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 6న పారిశ్రామిక వాడల్లో సంబరాలను నిర్వహించనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఐఐసీ అధికారులు ఉమ్మడి జిల్లాలోని 12 పారిశ్రామిక వాడల్లో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుతో పాటు భువనగిరి, రాఘరావుపేట, చిట్యాల, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో సంబరాలు నిర్వహిస్తారు. పారిశ్రామిక వాడలను తోరణాలతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. సభలను నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ సాధించాక పారిశ్రామిక పురోగతిపై వివరిస్తారు. పరిశ్రమలకు విద్యుత్ సమస్య లేకుండా ఎలా అందిస్తున్నారో సవివరంగా చెబుతారు.
మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.